Thursday, June 28, 2012

ఎన్నాళ్ళీ వారసత్వాలు?..


మన దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో కుటుంబస్వామ్యం వర్ధిల్లుతోంది.. బీజేపీ, వామపక్షాలను మినహాయిస్తే  దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు ఈ దరిద్రం పట్టింది.. జాతీయ  స్థాయిలో కాంగ్రెస్ ఇందిరా గాంధీ హయంలోనే కుటుంబ పార్టీగా మారిపోయింది.. నకిలీ గాంధీల గుప్పిట్లో కాంగ్రెస్ విలవిల లాడుతోంది.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ.. రేపు రాహుల్ గాంధీ.. అ తర్వాత కేతు గాంధీ.. శివ సేన, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్జెడి, జేడీ(ఎస్), బిజెడి, డిఎంకే పార్టీలలో కూడా ఇదే వరస.. ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికొద్దాం.. చంద్రబాబు నాయుడు తెలుగు యువత పగ్గాలను తన తనయుడు లోకేష్ బాబుకు ఇవ్వడం ద్వార రూట్ క్లియర్ చేస్తున్నారు.. ఎన్టీఅర్ నుండి కైవసం చేసుకున్న టీడీపీ పగ్గాలను తనయునికి అప్పజెప్ప బోతున్నారు.. అంటే టీడీపీ నాయకత్వం నందమూరి వారి నుండి నారావారికి బదిలీ అయ్యిందన్న మాట.. పాపం జూ.ఎన్టీఅర్..  అసలు టీడీపీకి చంద్రబాబే శాశ్వతంగా అధ్యక్షునిగా ఎందుకుండాలి? దేవేందర్ గౌడ్, ఎర్రన్నాయుడు, యనమల, కోడెల, కడియం తదితర సీనియర్లలో ఎవరో ఒకరికి అప్పగించ వచ్చు కదా?.. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో సోకాల్డ్ గాంధీ వంశం లాగే ఏపీలో వైఎస్ వంశాన్ని నిలపెడదామనుకున్న జగన్ పై గిట్టని వారు పగ బట్టారు.. అది వేరే విషయం లెండి.. 

No comments:

Post a Comment