Thursday, June 21, 2012

ప్రజల రాష్ట్రపతి


రాష్ట్రపతి పదవికి నేరుగా ఎన్నికలు ఉంటే గెలిచేది ఎవరో తెలుసా?.. కచ్చితంగా అబ్దుల్ కలాంజీయే.. వ్యక్తిత్వంలో ఆయనను మించిన అభ్యర్థి ఎవరున్నారు? దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాభిమానం ఉన్న వ్యక్తీ కలాంజీయే.. పజలు ఆయననే రాష్ట్రపతిగా కోరుకుంటున్నారని పలు సర్వేలలో తేలింది.. గతంలో రాష్ట్రపతి పదవి నిర్వహించిన అబ్దుల్ కలాం నిష్పక్షపాతంగా, సమర్థంగా వ్యవహరించారు.. ప్రణబ్, సంగ్మాలతో పోలిస్తే కలాం వంద శాతం ఉత్తమ అభ్యర్థి.. కుళ్ళు రాజకీయాలు నచ్చకే అబ్దుల కలాంజీ పోటీకి దూరంగా ఉన్నారనేది స్పష్టం.. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. కలాంజీనే రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకొని దేశప్రజల అభిమతాన్ని మన్నించాలి.. దేశ ప్రజల రాష్ట్రపతి కలాంజీయే..

No comments:

Post a Comment