Friday, June 8, 2012

చేప మందుపై ఎందుకీ పగ?

రాజేంద్రనగర్ లో చేప మందు కోసం వచ్చి తొక్కిసలాటలో గాయపడటం, ఒకరు మరణించడం బాధాకరం.. దీనికి బాధ్యత వహించాల్సింది సరైన ఏర్పాట్లు చేయని ప్రభుత్వమే.. రెండు రోజు ముందు వరకూ చేప మందు పంపిణీ వేదికను నిర్ణయించకపోవడం, చివరకు ఇచ్చిన స్టేడియం దగ్గర తొక్కిసలాటకు దారి తీపే పరిస్థితి కల్పించడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే.. అసలు ఏటా పంపిణీ జరిగే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎందుకు అనుమతి ఇవ్వనట్లో..

మృగశిర కార్తె నాడు బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప మందుకు యవద్దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.. సేవా భావంతో వారు ఇచ్చే మందు పర్యాటక పరంగా కూడా హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి గుర్తింపు తెచ్చింది.. కొన్ని నాస్తిక వేదికలు అనవసరంగా చేప మందుపై బురద చల్లుతున్నాయి.. చేప మందుపై నమ్మకంతో వచ్చే వారిని వీరు అడ్డుకోవడం ఎంత వరకూ సమంజసం? జలుబు వచ్చిన వాడు రిలీఫ్ కోసం విక్స్ వేసుకుంటాడు.. అంత మాత్రాన జలుబు తగ్గిపోతుందా?.. ఆస్తమా రోగులకు కూడా చేప మందు ఓ రిలీఫ్ అని ఎందుకు భావించ కూడదు.. చేప మందు మందును అడ్డుకునే వారు కేవలం మతాన్ని మాత్రమే టార్గెట్ చేసినట్లు మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.. తాయెత్తులు, పసరు మందులు, స్వస్థత ప్రార్థనలు చేసే మతాల జోలికి వెళ్లే సాహసం వీరెప్పుడైనా చేశారా? చేప మందు శాస్త్రీయమా, అశాస్త్రీయమా అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ నాస్తిక వేదికలు ఆస్తమా రోగులకు ఇంతకన్నా మెరుగైన సేవ ఏమైనా చేస్తున్నాయా? కనీసం మద్యపాన దురాచారాన్ని మాన్పించే ప్రయత్నాలేమైనా చేశారా? తమకు చేత కానప్పుడు ఒకరు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని, అందునా ఒక విశ్వాసం వారిని అడ్డుకొని ఎవరి కొమ్ము కాస్తున్నట్లు?

No comments:

Post a Comment