Sunday, February 26, 2017

ఏ శక్తీ కశ్మీర్ ను విడదీయలేదు..

 జమ్మూ కశ్మీర్ రాష్ట్రం భారత దేశంలో ఎప్పటికీ అంతర్భాగం.. ఏ శక్తి విడదీయలేదు అని సంకల్ప్ దివస్ చాటి చెప్పింది.. జమ్మూ కశ్మీర్ స్టడీ సెంటర్ – హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో కాచిగూడ భద్రుకా కాలేజీలో ఈ కార్యక్రమం జరిగింది.. దేశమంతా తమ వెంట ఉందనే నమ్మకాన్ని కశ్మీర్ పండిట్లకు, అక్కడి ప్రజలకు కల్పించాలని సంకల్ప్ దివస్ వక్తగా విచ్చేసిన జేకేఎస్సీ ఢిల్లీ డైరెక్టర్ అసుతోష్ భట్నాగర్ తెలిపారు.. ఇటీవల కశ్మీర్ లోయలో పర్యటించి వచ్చిన భారతీయ ప్రజ్ఞ ఎడిటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అక్కడి పురాతన దేవాలయాలు, తరిమివేయబడిన పండిట్ల శిథిల గృహాల పరిస్థితిని విరించారు..  కార్యక్రమానికి జేకేఎస్సీ హైదరాబాద్ ఛాప్టర్ ఉపాధ్యక్షుడు బీహెచ్ఆర్ చౌదరి అధ్యక్షత వహించారు.. కార్యక్రమంలో రాకా సుధాకర్, ఎన్వీకే ప్రసాద్, క్రాంతి దేవ్ మిత్ర, సుమంత్, అను శర్మ పిళ్లై, విక్రమ్ సింహా, కృష్ణ (కన్నన్), సోమేశ్వరరావు, రవి చావలి, సాయిబాబా, నీలేశ్, వీరప్ప గార్లతో పాటు ఇతర మిత్రులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment