Saturday, February 25, 2017

అటూ మనమే.. ఇటూ మనమే..

మహారాష్ట్రలో ఇప్పుడు అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా జాతీయవాదులే.. ఇటీవలి స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీ అఖండ విజయం నమోదు చేసుకుంది.. తర్వాతి స్థానంలో ఎన్డీఏ భాగస్వామి అయిన శివసేన నిలవడం విశేషం..
ఈ మార్పు చూస్తుంటే నాకు తమిళనాడు రాజకీయాలు గుర్తుకు వస్తున్నాయి.. అక్కడ కాంగ్రెస్ పార్టీకి అర్ధ దశాబ్దం కిందే ద్రవిడ పార్టీలు పాతరేశాయి.. 1967లో తమిళనాట అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఇప్పటికీ కోలుకోలేదు.. డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది..
ఇప్పుడు చూడబోతే మహారాష్ట్రలోనూ అదే దృశ్యం కనిపిస్తోంది.. గతంలో మిత్రపక్షాలైన బీజేపీ, శివసేన పార్టీలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, నిన్నటి స్థానిక ఎన్నికల్లో విడిగా పోటీ చేశాయి.. అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీలో ఉనికిని కోల్పోయాయి.. వారి ఓట్లు అన్నీ బీజేపీ వైపు మరలినట్లు స్పష్టం అవుతోంది.. గతంలో రాజ్ ఠాక్రే శివసేన నుండి విడిపోయి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన పెట్టడంతో ఆ పార్టీకి కళ్లెం పడింది.. ఇప్పుడు ఎంఎన్ఎస్పీ ఓట్లు తిరిగి శివసేనకు పడుతున్నాయని తెలుస్తోంది..
ఎన్టీఏలో భాగస్వామిగా ఉన్న శివసేన తన ఉనికిని కాపాడుకోడానికి అప్పుడప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం నుండి బయటకు వస్తామని హెచ్చరించండం ద్వారా సొంత అస్థిత్వాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది.. అయితే ఓటర్లు కాంగ్రెస్, ఎస్పీపీలను పక్కన పెట్టి బీజేపీ, శివసేనల్లో ఎవరికో ఒక్కరికి ఓటేస్తున్నారు..మొత్తానికి అక్కడ జాతీయవాద పార్టీలే గెలుస్తున్నాయన్నమాట..

No comments:

Post a Comment