Monday, February 13, 2017

తమిళ పీఠం ఎవరిది?

ఆలోచించండి.. వెరీ సింపుల్ లాజిక్..
జయలలిత అభిమానం చూరగొన్నందు వల్లే పన్నీర్ సెల్వం కష్ట కాలంలో ముఖ్యమంత్రి కాగలిగారు.. ఆమె నమ్మకాన్ని అయన వమ్ము చేయలేదు.. జయ జైలు నుండి తిరిగి వచ్చే వరకు పరిపాలనా విధులు జగ్రత్తగా చూసుకున్నారు.. ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు..
శశికళను జయ కేవలం స్నేహితురాలిగానే చూశారు.. గతంలో ఒకసారి ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తే గెంటేశారు.. తర్వాత క్షమించినా, సహాయకురాలిగానే చూశారు.. జయలలిత ఆదేశాల మేరకు శశికళ భర్త నటరాజన్ పోయస్ గార్డెన్ లోకి ప్రవేశం నిషేధం.. కానీ జయ మరణించిన వెంటనే అతగాడు తిరిగి రంగ ప్రవేశం చేయడంలోని ఆంతర్యం ఏమిటి?
జయ నిజంగానే శశిని రాజకీయ వారసురాలిగా భావించి ఉంటే ఓపీఎస్ బదులు ఆమెనే తాత్కాలిక సీఎంను చేసి ఉండేవారు కదా?..
సుప్రీంకోర్టు తీర్పు వెలువడే ముందు సెల్వంను దింపి సీఎం పదవి చేపట్టాలనే తొందర శశికి ఎందుకు?.. తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వస్తే జైలుకు పోతాను కాబట్టి జీవితంలో ఒకసారైనా ముఖ్యమంత్రి కావాలనే కోరిక తీర్చుకోవలనే దురాశ కాదా?.. ఒకవేళ సీఎం పదవి చేపట్టినా జైలుకు పోవాల్సి వస్తే తిరిగి పన్నీరే దిక్కు కదా?
జయలలిత అభిమానం చూరగొన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి ఎప్పటికీ దాసుడుగానే ఉండాలా?
ఇప్పుడు చెప్పండి.. తమిళనాడు సీఎం పదవికి నిజమైన వారసులు ఎవరు?

No comments:

Post a Comment