Friday, February 24, 2017

భారతమాత సేవలో శివైక్యం

జన్మస్థలం: మరాఠ్వాడా.. కార్యస్థలం: తెలుగు నేల.. చేపట్టిన పని: భారతమాత సేవ.. తుది శ్వాస వరకూ ఇదే పనిలో ఉన్నారు హల్దేకర్ జీ..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిలాల హల్దా గ్రామంలో ఫిబ్రవరి 5, 1930 నాడు జన్మించారు శ్రీరామచంద్ర సదాశివ హల్దేకర్.. హైదరాబాద్‌లో బీఎస్సీ చదువుతున్న సమయంలో వారికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరిచయమైంది.. చదువు వదిలేసి సంఘ ప్రచారక్‌గా పని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విభాగ్ ప్రచారక్, సహ ప్రాంత ప్రచారక్, ప్రాంత ప్రచారక్, క్షేత్ర ప్రచారక్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు..  పలు ప్రకృతి విపత్తుల సమయంలో హల్దేకర్ జీ నేతృత్వంలో స్వయం సేవకులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు
ఎంతో మంది స్వయంసేవకులు, వారి కుటుంబాలతో ఆత్మీయ సంబంధాలు ఏర్పరచుకున్నారు హల్దేకర్జీ.. తెలుగు భాషను నేర్చుకొని మరాఠీ నుండి ఎన్నో గ్రంధాలను అనువదించారు.. ఈ క్రమంలో డాక్టర్జీ జీవిత చరిత్రను పెను తుఫానులో ద్వీప స్థంబం, గురూజీ జీవిత చరిత్రను ఓం రాష్ట్రాయ స్వాహా పేరిట తెలుగులో తీసుకువచ్చారు..
హల్దేకర్ జీ పిత్రార్జితంగా వచ్చిన యావదాస్తిని సంఘానికి ఇచ్చేశారు.. కొంత కాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ చకిత్స పొందుతున్నారు.. రాంభావు హల్దేకర్‌జీ తన 87వ ఏట ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 12.15 గంటలకు బర్కత్‌పురాలోని కేశవ నిలయంలో తుదిశ్వాస విడిచారు. మరణానంతరం ఆయన కోరికపై నేత్రదానం జరిగింది..
దేశమాత సేవ కోసం, సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జ్యేష్ఠ ప్రచారకులు హల్దేకర్జీ సేవలు చిరస్మరణీయం.. ఓం శాంతి..

No comments:

Post a Comment