Thursday, March 2, 2017

కేరళ హత్యలపై స్పందన ఏది?

ఒకటా.. రెండా.. ఏకంగా 270 హత్యలు.. ఆరు దశాబ్దాలుగా సాగుతున్న బీభత్స హత్యాకాండ ఇది..
దేవ భూమిగా కేరళకు పేరుంది.. వామపక్ష పార్టీ దీన్ని మరుభూమిగా మార్చేసింది..

స్వయాన కేరళ ముఖ్యమంత్రి సొంత జిల్లా కన్నూరులోనే 80 మందిని హతమార్చారు.. అంతే కాదు స్వయాన ప్రస్తుత సీఎం పినరయి విజయన్ పై హత్యారోపణలు ఉన్నాయి.. దర్జీ పని చేసే రామకృష్ణ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆయన..
దేశంలో ఎక్కడో ఏదో చిన్న ఘటన జరిగితే దాన్ని భూతద్దంలో చూపించే వామపక్షులు తమ ఏలుబడిలోని కేరళలో సాగిస్తున్న మారణకాండ గురుంచి ప్రశ్నించే వారే లేరా? ఈ విషయంలో రాజకీయ పార్టీలు, పత్రికలు,, ఛానళ్లు, సోషల్ మీడియా ఎందుకు మౌనం పాటిస్తున్నాయి?
హత్యకు గురైనవారు చేసిన పాపమేమిటి?.. వారు జాతీయవాదులు కావడమేనా?.. ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా పని చేయడమే వారు చేసిన తప్పా?

No comments:

Post a Comment