Wednesday, July 20, 2016

నోరుంది కదా అని..


అబద్దాన్ని ఎన్నిసార్లు వల్లించినా నిజం కాదు.. దారిన పోయే దానయ్య రచ్చబండ దగ్గర ఏదో మాట్లాడితే, తాగి వాగుతున్నాడులే అని ఎవరూ పెద్దగా పట్టించుకోరు.. అతిగా ప్రవర్తిస్తే నాలుగు పీకుతారు.. మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్ హత్య చేసిందంటూ 68 ఏళ్లుగా దుష్ప్రచారం చేస్తున్న వారి తీరు కూడా దానయ్యల్లాగే ఉంది..
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇలాంటి కూత కూసి ఇరకాటంలో పడ్డారు.. పరువు నష్టం దావా ఎదుర్కొంటున్నాడు.. ఈ వ్యాఖ్యలపై పశ్చాతాపం వ్యక్తం చేయకుంటే విచారణ ఎదుర్కోక తప్పదని సుప్రీం కోర్టు హెచ్చరించింది..

అయినా సరే రాహుల్ క్షమాపణ చెప్పే ప్రస్తక్తి లేదంటూ ప్రకటన చేసి కాంగ్రెస్ పార్టీ న్యాయ వ్యవస్థపై తన గౌరవాన్ని ప్రకటించుకుంది.. చింత చచ్చినా పులుపు చావదంటే ఇదేనేమో..

No comments:

Post a Comment