Saturday, March 7, 2015

తిహార్ జైల్ టు దిమాపూర్ జైల్

నిర్భయ అత్యాచార ఘటన తాలూకూ బీబీసీ ‘ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ దేశ వ్యాప్తంగా గగ్గోలు పుట్టించిన సమయంలోనే ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో ఓ రేపిస్టును జనం జైలు నుండి బయటకు ఈడ్చుకొచ్చి చంపేశారు.. నిర్భయ ఉదంతంలో దోషిగా ఉరి శిక్ష పడ్డా, తీహార్ జైలులో ఉల్లాసంగా గడుపుతున్న ముఖేష్ సిగ్గులోకుండా మహిళలపై అత్యాచారాలను సమర్ధించుకున్నాడు.. దేశ ప్రజలంతా వాడి వ్యాఖ్యలపై ఆగ్రహంతో రగిలిపోయారు.. వాడిని వెంటనే చంపేయాలన్నారు.. యాదృచ్చికంగా నాగాలాండ్ దిమాపూర్ సిటీలో అదే జరిగింది. వేలాది మంది యువ జనం జైలుపై దాడి చేసి నిందితున్ని బయటకు లాక్కొచ్చారు.. నగ్నంగా కొట్టుకుంటూ తీసుకెళ్లి నడి రోడ్డు మీద చంపేశారు..
దిమాపూర్ ఘటనలో రెండు కోణాలు ఉన్నాయి.. నిందితుడు బంగ్లాదేశీ.. అసోం మీదుగా మన దేశంలో చొరబడ్డాడు.. దిమాపూర్లో వ్యాపారం చేసుకుంటూ బుద్దిగా ఉండకుండా స్థానిక నాగా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అరెస్టయి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నాడు.. అదే సమయంలో నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దిమాపూర్లో భారీ ర్యాలీ జరిగింది. ఇందులో వేలాది మంది విద్యార్థులు, యువతీ యువకులు, ప్రజలు పాల్గొన్నారు. స్థానిక, స్థానికేతర సమస్యపై జరుగుతున్న ఉద్యమ నేపథ్యంలో ఈ ప్రదర్శనకు వచ్చిన వారందరికీ అత్యాచార ఘటన పుండుపై కారం చల్లినట్లయింది.. దాని ఫలితమే జైలుపై దాడి, నిందితుని హత్య..

మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారు, దేశంలోని అక్రమంగా చొరబడుతున్న వారు సాగిస్తున్న ఆగడాలను చూస్తూ కపట నిద్ర నటిస్తున్న రాజకీయ నాయకులకు దిమాపూర్ ఉదంతం కనువిప్పు కావాలి.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని మెలగాలి.. లేకపోతే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయనడానికి ఈ ఉదంతం ఒక మచ్చుతునక..

No comments:

Post a Comment