Sunday, March 22, 2015

బిందువు బిందువు కలిస్తేనే సింధువు

ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా మనం ఎంత నీటిని వృధా చేస్తున్నామో ఆలోచించారా?.. కాలకృత్యాలకు వెళ్లినప్పుడు టాప్ విప్పి పెడతాం.. మొదట పళ్లు తోముకోముకునేటప్పుడు కూడా ఇలాగే నల్లా ఆన్ చేస్తాం.. స్నానానికి, బట్టలు ఉతకడానికి కూడా ఎంతో నీటిని అవసరానికి మించి వృధాగా వదులుతున్నాం.. టాప్ లీక్ అవుతున్నా, వాటర్ ట్యాంకు నిండి వృధాగా పోతున్నా పట్టించుకోము.. ఇలా ఒక మనిషి సగటున రోజుకు 5 బకెట్ల నీటిని వృధా చేస్తున్నాడని అఒక అంఛనా.. ఓ చిన్న కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే 20 బకెట్లు అలా వృధా అయిపోతున్నాయి.. ఈ లెక్కన పెద్ద కుటుంబం ఎంత వేస్ట్ చేస్తోందో ఆలోచించండి..
భారత దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భూగర్భ జలాలు శరవేగంగా ఇంకిపోతున్నాయి.. పరిస్థితి ఇలాగే కొనసాగితే భావితరాలు తాగునీటికి అల్లాడిపోక తప్పదు.. నీటిని చాలా వరకు వృధా చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. తాగు నీటికి కొరత ఏర్పడితే ఆనేక జబ్బులు మనల్ని చుట్టుముడతాయి..
ప్రతి నీటి బొట్టు విలువైనదే.. ముందు మన ఇంటి నుండే జలసంరక్షణ ప్రారంభించాలి.. నీటిని వృధా చేయడాన్ని అరికట్టండి.. నీటిని వృధాగా వదిలేయకుండా అవసరమైన మేరకే వాడుకోండి.. ముందు మీ కుళాయిలు లీకేజీ లేకుండి చూసుకోండి. ట్యాంకు నిండగానే మోటారు ఆఫ్ చేయడండి.. మీ ఇంటి చుట్టే మొక్కలు పెంచుకోండి.. వర్షాకాలంలో మేడపై నుండి పడే నీరు వృధాగా డ్రైనేజీలో కలవకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోండి.. ఫలితంగా భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది. నీటి కొరత ఉన్న గ్రామాల్లో రైతులు ఆరుతడి పంటలు వేసేలా, డ్రిప్ ఇరిగేషన్ చూపట్టేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలను పెంచాలి.. కొండ ప్రాంతాల్లో చెక్ డ్యామ్స్ విరివిగా నిర్మించాలి..

బిందువు బిందువు కలిస్తేనే సింధువు అవుతుంది.. చెరువులు, వాగులు, నదులు నిండుగా ఉన్నప్పుడే పర్యావరణ సమతౌల్యం ఉంటుంది.. ఇవాళ ప్రపంచ జల దినోత్సవం (మార్చి 22).. జల సంరక్షణ నేటి నుండే మొదలు పెడదాం..

No comments:

Post a Comment