Wednesday, November 26, 2014

తీవ్రవాదంపై సమరం సాగాలి..

1857.. ఈ సంఖ్య మన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ (సిపాయిల తిరుగుబాటు) సంవత్సరం అనుకుంటున్నారా?.. అంతే కాదు యాదృచ్చికంగా తీవ్రవాదులు ఇప్పటి దాకా మన దేశ పౌరులను పొట్టన పెట్టుకున్న పౌరుల సంఖ్య కూడా ఇంతే.. ఆగస్టు 2,1984 నాటి మీనం బాకం బాంబు పేలుడు మొదలుకొని ఈ ఏడాది మే 1, 2014 వరకూ దేశంలో జరిగిన 58 ఉగ్రవాద ఘటనల్లో మరణించిన పౌరుల సంఖ్య 1857.. ఇందులో అత్యధికంగా ముంబయిలో జరిగిన మూడు ఘోర బాంబు దాడుల సంఘటనల మృతులు ఉన్నారు..(సోర్స్:వికీపీడియా)
తీవ్రవాదం మన దేశానికి ప్రధాన సమస్యగా మారింది.. శతృవు ఎక్కడో ఉండడు.. మన మధ్యలోనే ఉంటాడు.. చెప్పిరాడు.. హఠాత్తుగా వచ్చి పని కానిచ్చుకొని పోతాడు.. అప్రమత్తంగా లేకపోతే మనకే ప్రమాదం.. ఇందులో పొరుగు దేశాల ప్రోత్సాహంతో కొనసాగుతున్న ఉగ్రవాద సంస్థలు కొన్నయితే.. వివిధ రాష్ట్రాల్లో ఉద్యమాల పేరుతో కొనసాగుతున్న సంస్థలు మరికొన్ని..
దేశ ప్రజలంతా తీవ్రవాదానికి వ్యతిరేకంగా గళం ఎత్తాలి.. కలిసికట్టుగా పోరాడాలి.. ఐక్యతను ప్రదర్శించాలి.. మనకెందుకులే అని తప్పించుకునే పరిస్థితి లేదు.. మనం వెళ్లుతున్న రోడ్డు మీదో, హోటళ్లోనో, థియేటర్లోనే ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.. హైదరాబాద్లో ఛాట్ తినేందుకు వెళ్లి, తిరిగి రాని లోకాలకు పోయారు అమాయక ప్రజలు.. తీవ్రవాదులు ఎప్పుడు ఏ రూపంలో పొంచి ఉంటారో, ఎవరిని పొట్టనపెట్టుకుంటారో ఎవరికి తెలుసు?
26/11 దేశ చరిత్రలో మరుపురాని తేదీగా మిగిలిపోయింది నవంబర్ 26, 2008నాడు పాకిస్తాన్ నుండి వచ్చిన తీవ్రవాదులు దేశ వాణిజ్య రాజధాని ముంబై మీద దాడి చేసి మారణ హోమం సృష్టించారు.. ఎందరో పౌరులు బలైపోయారు.. తీవ్రవాదులను తిప్పికొట్టే క్రమంలో వీర జవానులు, పోలీసులు నేలకొరిగారు.. ఈ రోజున వారందరికీ నివా
ళులర్పిద్దాం.. తీవ్ర వాదానికి వ్యతిరేకంగా మన గళం వినిపిద్దాం..

No comments:

Post a Comment