Friday, November 21, 2014

1947.. ఒక శరణార్ధి కథ

యువరాజ్ గుప్తా.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీర్పూర్ జిల్లా కోట్లి పట్టణ వాసి.. భారత దేశంలో జమ్మూ కాశ్మీర్ విలీన సందర్భంగా పాకిస్తాన్ సైన్యం ఆయన స్వస్థలాన్ని ఆక్రమించింది.. 27 నవంబర్, 1947 రోజున 14 ఏళ్ల వయస్సులో యువరాజ్ గుప్తా తన కుటుంబ సభ్యులతో జమ్మూకు వలస వచ్చేశారు.. రైల్వే శాఖలో పని చేసి రిటైర్ అయిన యువరాజ్ గుప్తా తన పుట్టిన ఊరు, చిన్నప్పటి జ్ఞాపకాలను మరువలేదు.. ఆ ప్రాంతంతో మనసిక సంబంధం వదులుకోలేక 2004లో అతికష్టం మీద పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్ వెళ్లారు.. వీసాపై పీవోకే వెళ్లిన తొలి హిందూ ఆయనే కావడం మరో విశేషం..

హైదరాబాద్ వచ్చిన యువరాజ్ గుప్తా జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం (హైదరాబాద్ విభాగం) బృందంతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజల కడగండ్లను, ఉగ్రవాదుల దుశ్యర్యలను చెప్పుకొచ్చారు.. తనకు జన్మనిచ్చిన స్వస్థలం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కడగండ్లకు చెప్పుడూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు.. యువరాజ్ గుప్తా చెప్పిన విషయాలు చాలా ఆసక్తిని, బాధను కలిగించాయి.. ప్రస్తుతం పీవోకేలో హిందువుల జనాభా శాతం ‘0’ .. పాకిస్తాన్ సైన్యం దాదాపుగా వారిని నిర్మూలించడమో, తగలేయడమే, తరిమేయడమే చేసేసింది.. విధిలేని పరిస్థితుల్లో కొందరు మతం మార్చుకున్నారు.. పీవొకే ప్రజలు పాకిస్తాన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని యువరాజ్ గుప్తా అంటున్నారు.. పాకిస్తాన్ చెర నుండి విముక్తి కోసం వారు తపిస్తున్నారట.. తన జ్ఞాపకాలు, అనుభవాలతో యువరాజ్ గుప్తా త్వరలో ఓ పుస్తకం రాస్తున్నారు.. కొద్ది వారాల్లోనే అది మన ముందుకు రాబోతోంది..

No comments:

Post a Comment