Tuesday, November 18, 2014

విశ్వ నాయకుని పాత్రలో మోదీ..

సిడ్నీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం ప్రవాస భారతీయుల మదిని తట్టింది.. భారతీయులుగా పుట్టినందుకు ఎందుకు గర్వించాలో సూటిగా చెప్పారుు మోదీ.. భారత దేశం ఒకనాటి విశ్వ గురువు స్థానాన్ని తిరిగి సంపాదించడానికి ఇక ఎంతో దూరం లేదు అనే విశ్వాసం కలిగించింది..
నరేంద్ర మోదీ భారతీయుల మనస్సు గెలుచుకొని ప్రధానమంత్రి కావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.. ఇప్పుడు చాలా తక్కువ సమయంలోనే ప్రపంచ నాయకుని స్థాయిని పొందుతున్నారు.. మోదీ ఏ దేశానికి వెళ్లినా ప్రవాస భారతీయులు బ్రహ్మరథం పడుతున్నారు.. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో నరేంద్ర మోదీ బహిరంగ సభలు ఎంతో విజయవంతం అయ్యాయి.. అక్కడి ప్రభుత్వాలు ఆయనకు రాక్ స్టార్ ఇమేజీని ఇచ్చాయి.. గతంలో ఏ భారత ప్రధానమంత్రికీ లేనంతటి ఆదరణ మోదీ పట్ల చూపించారు ప్రవాస భారతీయులు.. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు ఎంతో మంది విదేశీ నాయకులు వస్తుంటారు.. కానీ వారి సభలో ఎంత భారీగా, ఆర్భాటంగా జరిగిన దాఖలాలు లేవు.. భారత దేశమంటే విదేశీయులకు తెలిసింది గాంధీ, నెహ్రూ మాత్రమే.. ఇప్పుడు నరేంద్ర మోదీని సైతం శక్తివంతమైన విశ్వ నాయకునిగా గుర్తిస్తున్నారు.. ఇది మోదీకి మత్రమే కాదు భారతీయులందరికీ గౌరవమే..

No comments:

Post a Comment