Wednesday, November 19, 2014

ఈయనకు పబ్లిసిటీ పిచ్చి ముదిరింది..

ఈ వ్యక్తిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది.. తన కొత్త సినిమా రిలీజింగ్ సమయంలో పబ్లిసిటీ కోసం ఏదో వాగేస్తాడు.. వార్తల్లోకి వస్తాడు.. అందరి దృష్టి పడుతుంది.. సాధారణంగా తిట్లే ఉంటాయి.. కానీ అదే ఆయనకు కావాలి.. చాలా ఛీప్ ట్రిక్ ఇది..
ఇతని పబ్లిసిటీ పిచ్చి కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తుంది.. స్వతహాగా నాస్తికుడైన ఈయన దురద్దేశ్యాలతో హిందూ దేవుళ్లను వివాదాల్లోకి లాగుతుంటాడు.. తాజాగా తెలంగాణ వారికి యాదగిరి నరసింహ స్వామి ఉన్నాక, తిరుపతి వెంకటేశ్వరుడు ఎందుకు అని వాగాడు.. తెలంగాణ వారు తిరుపతి దేవున్ని మొక్కితేనేం.. ఆంద్రావారు యాదగిరి దేవున్ని పూజిస్తేనేం.. మధ్యలో ఈ నాస్తికునికి ఏం నొప్పి?
దేవుళ్లకు ప్రాంతాలను ఆపాదించి ఉద్రిక్తతలు సృష్టించి పబ్లిసిటీ పొందే ఈయన మనస్థత్వం చాలా నీఛం.. ఏ ప్రాంతానికైనా దేవుడు ఒక్కడే.. దేవుళ్లు సరిహద్దులుంటాయా? ఈ పెద్ద మనిషికి విష్ణువు అవతారాలు తెలియవని అనుకోను..వెంటేశ్వరుడైనా, నరసింహుడైనా ఒక్కరే..
ఇలాంటి వ్యక్తులను ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిదేమో..

No comments:

Post a Comment