Sunday, November 9, 2014

జనం నేతకు మళ్లీ కేంద్ర మంత్రి పదవి

కొందరికి పదవులతోనే గుర్తింపు.. పదవులకు గుర్తింపు తెచ్చేవారు మరి కొందరు.. ఇక పదవులు ఉన్నా, లేకున్నా గుర్తింపు ఉన్నవారు చాలా అరుదు.. మన దత్తన్నది ఈ కోవే..
ఆరు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న బండారు దత్తాత్రేయ గారిని మూడోసారి కేంద్ర మంత్రి పదవి వరించడం బీజేపీ కార్యకర్తలకు మాత్రమే కాదు, రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలను, నాయకులను, పార్టీలకు అతీతంగా ఆనందం కలిగించిన వార్త..
దత్తాత్రేయ గారు ఆర్ఎస్ఎస్ ద్వారా సమాజ సేవకు అంకితమైన దత్తాత్రేయ ఎమర్జెన్సీ సమయంలో నిర్వహించిన పాత్ర, దివిసీమ ఉప్పెన అప్పుడు చేపట్టిన సేవ మరువలేనిది.. బీజేపీలో పదవులను సమర్ధవంతంగా చేపట్టారు.. నాలుగు సార్లు సికింద్రాబాద్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు.. అటల్జీలో పాటు నేడు మోదీ మంత్రి వర్గంలో మంత్రి పదవులు నిర్వహించడం సంతోషకరం..
బండారు దత్తాత్రేయ గారు ఎప్పుడు ప్రజల మధ్యే ఉంటారు.. అధికారంలో ఉన్నా, లేకున్నా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం ఆయన నైజం.. గతంలో కేంద్ర రైల్వే, పట్టణాభివృద్ధి శాఖలకు సహాయ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరానికి ఎంఎంటీఎస్ రైలును తీసుకొచ్చారు దత్తాత్రేయ.. అలాగే వాంబే పథకం కింద ఎంతో మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు.. కానీ దీనికి అంతగా ప్రచారం దక్కకపోవడం ఆశ్చర్యకరం..
దత్తాత్రేయకు పార్టీలకు అతీతంగా అందరితో కలుపుగోరుగా ఉంటారు.. రాజకీయ ప్రత్యర్థులను సైతం ఆత్మీయంగా పలకరిస్తారు.. ప్రతి ఏటా దసరా సమయంలో తెలంగాణలో అలయ్ బలయ్ కార్యక్రమంతో అన్ని పార్టీల నేతలను ఒకే వేదికపైకి తేవడం సామాన్య విషయం కాదు..
మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దత్తన్న తెలుగు రాష్ట్రాల సర్వతో ముఖాభివృద్ధిలో తనదైన ముద్రను చూపుతారని కచ్చితంగా చెప్పగలను..వారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు..

No comments:

Post a Comment