Sunday, November 2, 2014

పేదలకు వరం.. ఉచిత వైద్యం

చాలా కాలంగా ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నాయి.. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు, సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోయాయి.. ఫలితంగా ప్రజలు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.. ఇక పేదవాడికి పెద్ద రోగం వస్తే అప్పు చేసి, ఆర్థికంగా చితికిపోతున్నాడు.. వైద్యానికి డబ్బు పుట్టక విధిలేక మరణిస్తున్న సందర్భాలు ఉన్నాయి.. ఇక ఇదంతా గతం కాబోతోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెస్తున్న సరికొత్త పథకం దేశ ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ఆశాజ్యోతిగా కనిపిస్తోంది..
ఇకపై ఆస్పత్రులకు వెళ్లితే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.. ఎంత పెద్ద రోగానికై ఉచితంగా చికిత్స చేస్తారు.. మందులు కూడా ఉచితమే.. ఈ ఖర్చునంతా కేంద్ర ప్రభుత్వమే భరించబోతోంది.. ఇది కల కాదు నిజం రూపం దాల్చబోతోంది.. ప్రజారోగ్యం బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే.. ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చు ఆదా కావడం, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇప్పటికే ఈ మేరకు నివేదికను తయారు చేసింది..

అమెరికాలో అమలవుతున్న తరహా యూనివర్సల్ హెల్త్ ఫ్లాన్ భారత దేశంలోనూ తీసుకురావడానికి ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే ఈ పథకం 2019 నాటికి దేశ వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. ఇందు కోసం 1.6 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చుచేయబోతున్నారు.. దేశంలోనే అతిపెద్ధ ఆరోగ్య పథకం అతి త్వరలో మన ముందుకు రాబోతోంది.. 

No comments:

Post a Comment