Thursday, September 5, 2013

ఇదేనా సమన్యాయం?..

ఒకరిని అనుమతి, మరొకరికి నిరాకరణ ఇదేనా సమన్యాయం?.. సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్ నగరంలో ఏపీఎన్జీవోలు సభ పెట్టుకోవచ్చట, తెలంగాణ వాదులు శాంతి ర్యాలీ జరపొద్దట.. ఇదెక్కడి న్యాయం?.. ఇస్తే ఇద్దరికీ అనుమతి ఇవ్వండి. లేదంటే ఇద్దరికీ వద్దని చెప్పండి.. ఎవరు ముందు అనుమతి కోరారన్నది ముఖ్యం కాదిక్కడ.. ఆ మాటకు వస్తే లాల్ బహద్దూర్ స్టేడియంలో క్రీడల నిర్వహణ కోసం ఏపీఎన్జీవోలకన్నా ముందే అనుమతి కోరిన వారికి శాప్ అందుకు ఇవ్వలేదు అనుమతి..
రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార పార్టీ అధ్యక్షుడు తమ హోదాలను గుర్తెరిగి తెలంగాణ, సమైక్యవాదులను సమదృష్టితో చూడాలి.. కానీ వారు తమ ప్రాంతీయ ఆకాంక్షల పేరిట సమైక్యవాదానికి వత్తాసు పలుకుతూ, తమ అధిష్టానం నిర్ణయాన్ని ఎదురిస్తున్నారు.. ఈ కారణం వల్లే తెలంగాణ వాదుల సభకు అనుమతి ఇవ్వకుండా సమైక్యవాదులకే అవకాశం ఇచ్చారు.. ఈ విషయం మెడ మీద తలకాయ ఉన్నోళ్లందరికీ తెలుసు..
ప్రజాస్వామ్యంలో సభలు, ప్రదర్శనలు జరుపుకొని తమ భావజాలాన్ని ప్రచారం చేసుకునే హక్కు అందరికీ ఉంది.. అదే సమయంలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటే అనుమతి నిరాకరించే హక్కు ప్రభుత్వానికీ ఉంది.. కాని పక్షపాతం చూపడం ఎందుకు? తెలంగాణ వాదుల వల్ల శాంతి భద్రతలకు హాని, సమైక్యవాదుల వల్ల శాంతి భద్రతలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోందా? అదే నిజమైతే ధైర్యంగా ఇదే విషయం చెప్పండి..

No comments:

Post a Comment