Wednesday, September 11, 2013

ప్రధాని ఓ డమ్మీ..

అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట మరోసారి దిగజారింది.. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఓ డమ్మీ అని, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడంలో విఫలమయ్యారని తాజాగా న్యూయార్క్ టైమ్ పత్రిక విమర్శించింది.. భారత్ పరిస్థితి మరీ దుర్భరంగా ఉందని మన్మోహన్ దుర్భర నాయకుడని, అసలు అధికారాలు సోనియా గాంధీ చేతిలో ఉన్నాయని వ్యాఖ్యానించింది.. కొద్ది నెలల క్రితం టైమ్పత్రిక మన్మోహన్ సింగ్ పై విఫలుడు అనే ముద్ర వేసింది.. ఇప్పడు న్యూయార్క్ టైమ్స అదే విధంగా రాసింది.. ఈ విషయాలన్నీ భారతీయులకు కొత్త కాదు.. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి చర్చ జరగడం వల్ల భారత దేశ ప్రతిష్ట ఎంతగా మసగబారుతోందో ఆలోచించండి..

No comments:

Post a Comment