Friday, September 27, 2013

అర్థం లేని చర్చలు ఎందుకు?

పాకిస్తాన్ ప్రేరిత లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు ముగ్గురు సరిహద్దు దాటి వచ్చి పోలీసు స్టేషన్, సైనిక స్థావరంపై దాడి చేసి 10 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకున్నారు.. సాధారణ పరిస్థితుల్లో తెలుగు దినపత్రికల్లో మొదటి పేజీలో ఈ వార్త రావాల్సి ఉంది.. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా లోపలి పేజీల్లో సర్దేశారు.. దేశ సరిహద్దుల ఎంత భద్రంగా ఉన్నాయో, ఈ వార్తే చెబుతోంది.. ఆదివారం నాడు న్యూయార్క్ లో భారత, పాకిస్తాన్ ప్రధాన మంత్రులు సమావేశమవుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు.. ఇదే నిజమైతే ఉగ్రవాదులు భారత భూభాగంలోనే ఎందుకు దాడి చేశారు.. ఆ నిరసన ఏదో పాకిస్తాన్లో కూడా వ్యక్తం చేసి ఉండొచ్చు కదా?
భారత్ విషయంలో పాకిస్తాన్ వైఖరి ఇప్పటి వరకూ రవ్వంత కూడా మారలేదు.. ఈ పరిస్థితుల్లో ఆ దేశంతో మనం చర్చలు జరపాల్సిన అవసరం ఏమిటి? పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఆ దేశ సైన్యం, శాసన వ్యవస్థలపై ఏ మాత్రం పట్టులేదు.. గతంలో అటల్ బిహారీ వాజ్ పేయి బస్సు యాత్ర తర్వాత ఏమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.. కార్గిల్ లో పాకిస్తాన్ సైనికులు తిష్ట వేయడం, మన సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టడం తెలసిందే.. అసలు కార్గిల్ వ్యవహారం తనకు తెలియకుండా జరిగిపోయిందని నవాజ్ వాపోయాడు... ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యాధిపతి ముషారఫ్ ఆయనను పదవీ భ్రష్టున్ని చేసి తానే అధిపతి అయిపోయాడు..
ఇలాంటి వ్యవస్థ ఉన్న దేశంలో మన దేశం చర్చలు జరిపి ఉపయోగం ఏమిటి? ఈ చర్చల ఒప్పందాలకు ఆ దేశం కట్టుబడి ఉంటుందన్న గ్యారంటీ ఏమిటి? వారి దేశంపై వారికే పట్టులేని వారితో చర్చలు జరపడంలో అర్ధం లేదు..

కాశ్మీర్ విషయంలో, భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాల విషయంలో పాకిస్తాన్ వైఖరి మారనంత వరకూ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు.. ప్రధాని మన్మోహన్ సింగ్, నవాజ్ షరీఫ్ తో జరిపే అర్ధం లేని చర్చలను నిరసిద్దాం..

No comments:

Post a Comment