Monday, September 16, 2013

ధర్మో రక్షతి రక్షిత:

ధర్మో రక్షతి రక్షిత: అన్నారు మన పెద్దలు.. ధర్మాన్ని రక్షించాల్సినవారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఏమవుతుందో ఆలోచించండి..
హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల-తిరుపతిలో జరుగుతున్న పరిణామాలపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టక పోవడం ఆందోళన కలిగిస్తోంది.. సాక్షాత్తు శ్రీవారి మెట్ల మార్గం సమీపంలోనే ఒక ఇస్లామిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. ఇంత జరుగుతున్నా మన పాలకులకు, అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదు.. రాజకీయ నాయకులతో నిండిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గానికి ఇదేమీ పట్టడంలేదు.. సదరు ఛైర్మన్ గారు ఉద్యమాల్లో బిజీగా ఉన్నారు.. మన సోకాల్డ్ సెక్యులర్ ప్రభుత్వానికి హిందువుల మనోభావాలు అంటే గిట్టవు.. కానీ వారు సమర్పించు కానుకలు మాత్రం ఎలా మింగేద్దామా అనే అలోచిస్తుంటుంది..
తిరుమలపై కుట్రలు కొత్తేమీ కాదు. కానీ కొద్ది సంవత్సరాలుగా ఇలాంటి కార్యకలాపాలు ఊపందుకున్నాయి.. ఏడు కొండలపై ఎందరో అన్యమతస్తులు తిష్ట వేశారు.. చాపకింద నీరులా తమ మత ప్రచారం సాగిస్తున్నారు.. అప్పుడప్పుడు అధికారులు వారిని పట్టుకున్నట్లు నటిస్తున్నా, వారికి ఏ శిక్ష విధించకుండానే వదిలేస్తున్నారు.. ఇలాంటి పనులు మధ్యప్రాచ్యంలో జరిగితే ఏం చేస్తారో తెలుసా?.. ఏకంగా మరణ దండనే విధిస్తారు..
గతంలో ఒక ముఖ్యమంత్రి ఏడుకొండలను రెండు కొండలకే పరిమితం చేయబోయి, భక్తుల ఆందోళనతో వెనక్కి తగ్గాడు.. అన్యమత అధికారి ఒకరు తిరుమలపైకి రోప్ వే నిర్మించి పర్యాటక విలాస కేంద్రంగా మార్చాలనే ప్రతిపాదన తెచ్చాడు.. ఒక ఛైర్మన్ గారు ఏకంగా బ్రహ్మోత్సవాల్లో శిలువలనే ప్రతిష్టించబోగా స్థానిక బీజేపీ నాయకులు ఈ కుట్రను భగ్నం చేశారు.. దేశం ఆర్థిక సంక్షోభంలో పడిందని అందుకు బంగారమే కారణమని మొత్తుకుంటున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు శ్రీవారి నగలపై కన్నేశారు.. హిందూ భక్తులు స్వామి వారిపై ప్రేమతో ఇచ్చే కానుకలతో ఈ సెక్యులర్ ప్రభుత్వానికి ఏం సంబంధం? అని అడిగేవారే కరువయ్యారు.. ఇటీవల ఉద్యమం పేరిట టీటీడీ దేవస్థాన సిబ్బంది సైతం భక్తులను అగచాట్లకు గురి చేస్తూ శ్రీవారికి దూరం చేస్తున్నారు.. స్వామి వారు కలలో కనిపించి తనకు విశ్రాంతి దొరుకుతోందని శోకబాబుకు చెప్పాడట.. అన్య మతస్తులు తమ ఆరాధనా కేంద్రాల్లో ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకుంటూ, ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు హిందూ మతస్తులకే ఎందుకు ఈ తిప్పలు?
తిరుపతిలో ఇస్లామిక్ విద్యాలయం వస్తే తప్పేమిటని కొందరు వ్యక్తులు అడ్డగోలుగా వాదిస్తున్నారు.. అలాంటి అన్యమత కేంద్రాలను తిరుపతి దగ్గరే ఎందుకు పెట్టాలి.. దేశంలో, రాష్ట్రంలో వారికి భూమే కరువైంది.. ఇస్లామిక్ ధార్మిక క్షేత్రాల్లో వేద పాఠశాలలకు అనుమతి ఇప్పిస్తారా? ఇప్పటికే తిరుపతి పట్టణం మద్యం మాఫియా, భూబకాసురలతో కలుషితం అవుతోంది.. తాజాగా పులిమీద పుట్రలా అన్యమత కేంద్రం వస్తోంది..
తిరుమల తిరుపతి అంశంపై పోరాడేందుకు ఇకనైనా మనమంతా మేలుకోకపోతే భవిష్యత్ తరాలు మనను క్షమించవు..

ధర్మో రక్షతి రక్షిత:
 

No comments:

Post a Comment