Sunday, May 5, 2013

ఆంగ్లేయుల వారసులు కాంగేయులు

ఆంగ్లేయులు పెట్టిన చిచ్చును కాంగేయులు కొనసాగిస్తున్నారా?..

మిత్రులారా.. నేనేదో అతిశయోక్తిగా ఈ వ్యాఖ్య చేయడం లేదు.. ఒక్కసారిగా ఆలోచించండి.. దేశ మంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ.. దురదృష్టవశాత్తు మన పాలకులకు దేశ భద్రతకన్నా తమ స్వప్రయోజనాలే మిన్నగా కనిపించాయి.. విదేశాంగ విధానంలో అడుగడుగునా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి..
ఈ రోజున పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, బర్మా, శ్రీలంక, నేపాల్, భూటాన్ గా పిలిచే దేశాలన్నీ ఒకప్పడు భారత దేశంలో అంతర్భాగంగా ఉండేవి.. (జత పరచిన బ్రిటిష్ ఇండియా మ్యాప్ చూడండి) టిబెట్ మన రక్షణలో ఉండేది.. బ్రిటిష్ వారు క్రమ క్రమంగా ఒక్కో ప్రాంతాన్ని విడదీస్తూ వచ్చారు.. చివరగా 1947లో పాకిస్థాన్ శాశ్వత శతృవును ఏర్పాటు చేసి పోయారు.. పోతూ పోతూ అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ చేతిలో పెట్టి పోయారు.. ఈయన గారు కాశ్మీర్ సంస్థానం పూర్తిగా విలీనం కాకుండా ఐక్యరాజ్య సమితి వ్యాజ్యం వేశారు.. ఆ చిచ్చు ఈ నాటికీ రగులుతూనే ఉంది.. మరోవైపు టిబెట్ ను అన్యాయంగా చైనా ఆక్రమిస్తే దాన్ని సమర్ధించారు నెహ్రూ.. హిందీ, చీనీ భాయి భాయి అంటూ పంచశీల మంత్రాన్ని ఆలపించారు.. 1962లో చైనా మన దేశంపై దండయాత్ర చేస్తే గానీ ఈయన గారి భ్రమలు తొలగలేదు.. చైనా అక్సాయ్ చిన్ ప్రాంతంలో తిష్టవేస్తే గడ్డి పోచ చూడా మొలవని ప్రాంతం మనకెందుకు అని నిష్టూరమాడారు.. ఆగ్రహించిన ఓ పార్లమెంట్ సభ్యుడు మీ తలమీద కూడా వెంట్రుకలు లేవు.. ఆ తలకాయెందుకు? అని నెహ్రూకి బుద్ది చెప్పారు..
ప్రపంచ శాంతి దూతగా పేరు తెచ్చుకొని, నోబుల్ బహుమతి కొట్టేయాలనే కలలు కల్లలై నెహ్రూగారు కాలధర్మం చేశారు.. ఆయన కూతురు ఇందిరా గాంధీ పాకిస్థాన్ ని విడదీసి బంగ్లాదేశ్ ఏర్పాటుకు తోడ్పాటును అందించడం అభినందనీయం.. కానీ కచ్చతీవు దీవులను శ్రీలంకకు అప్పగించిన ఘనత ఆమెగారిదే.. ఆమె వారసుడుగా వచ్చిన రాజీవ్ గాంధీ హయంలో చైనా మరోసారి భారత్ లోకి చొరబడి అరుణాచల్ ప్రదేశ్లో తిష్టేసింది.. మరోవైపు తీన్ బిఘా ప్రాంతాన్ని బంగ్లాదేశ్ కు అప్పగించే కార్యక్రమానికి రాజీవ్ శ్రీకారం చుడితే పీవీ నరసింహరావు కాలానికి పూర్తయింది(క్షమించాలి సంవత్సరం కచ్చితంగా చెప్పలేక పోతున్నాను)
ఇక ప్రస్తుత కాలానికి వద్దాం చైనా మరోసారి దూకుడు ప్రదర్శించి లద్దాఖ్ లో స్థావరం ఏర్పాటు చేసింది.. దురదృష్ట వశాత్తు నేటి ప్రధాని మన్మోహన్ సింగ్ గత కాంగ్రెస్ పాలకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ చైనాకు ధీటైన సమాధానం ఇవ్వలేక పోతున్నారు..
మిత్రులారా ఇప్పడు చెప్పడి నేను మొదట వాడిన పదాలు సరైనవేనా? కాదా?.. ఆంగ్లేయులకు అసలు సిసలు వారసులుగా కాంగేయులు తయారయ్యారా? లేదా?..


No comments:

Post a Comment