Wednesday, May 29, 2013

కాంగ్రెస్ పాలకులకు ఇది మామూలే..

యూపీఏ హోంమంత్రులు దేశాన్ని కదిలించే ప్రధాన సమస్యలు ఎదురైనప్పుడు ఎంత సీరియస్ గా ఉంటారో ఒకసారి గమనించండి.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో హతమార్చినా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఇప్పటి దాకా అక్కడికి వెళ్లలేదు.. ఎవరినీ పరామర్శించేదు.. కనీసం సమీక్షించలేదు.. అసలాయన దేశంలో ఉంటే కదా? అమెరికాలో అధికారిక పర్యటన పూర్తయినా అక్కడే విహార యాత్ర చేస్తున్నారు షిండే.. ముంబాయి మీద తీవ్రవాదుల దాడి చేసినప్పడు నాటి కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ ఇలాగే పిల్ల చేష్టలు చేసి పదవి పోగొట్టుకున్నాడు.. ఇక చిదంబరం గారి తెలంగాణ ప్రకటన ప్రహసనం తెలిసిందే..
ఛత్తీస్ గఢ్ మావోయిస్టుల ఘాతుకానికి మీరంటే మీరే కారకులని కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి.. కారకులు ఎవరైనా ఒకటి మాత్రం స్పష్టం.. ఎవరు తీసిన గోతిలో వారే పడతారనేది నిరూపితమైంది.. మహేంద్ర కర్మ కుటుంబ సభ్యులతో సహా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలోని ప్రత్యర్థులను అనుమానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. నిజానిజాలు విచారణలోనే తేలాలి..

మన దేశంలో నక్సలైట్ల కార్యకలాపాలు ఈ స్థాయిలో విస్తరించాలంటే పాలకుల వైఫల్యాలే కారణం.. ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీయే ప్రధానంగా బాధ్యత వహించక తప్పదు.. నక్సలిజం మంచిదా? కాదా అనే విషయాన్ని నేను ఇక్కడ చర్చిండం లేదు ఎవరి అభిప్రాయాలు వారివి.. నా వరకైతే వారి సిద్ధాంతాలు, విధానాలపై నమ్మకం లేదు..



No comments:

Post a Comment