Friday, May 17, 2013

క్రికెట్ ఒక్కటే ఆట కాదు..

జార్జ్ బెర్నార్డ్ షా అన్నారు.. 11 మంది వెర్రివాళ్లు ఆడుతుంటే, మరో 11 వేలమంది వెర్రివాళ్లు చూసే ఆటే క్రికెట్ అని. కాల క్రమంలో టీవీలు, ప్రత్యక్ష ప్రసారాలు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కోట్లాది మంది క్రికెట్ ఆటను చూడటం మొదలు పెట్టారు.. బెర్నార్డ్ షా చెప్పినట్లు వెర్రి ఎంతగా ముదిరిందంటే క్రికెటర్లను దేవుళ్లుగా ఆరాదించే స్థాయి చేరింది..

క్రికెట్ ఆట ఓ వ్యాపారంగా మారిపోయింది.. ముఖ్యంగా మన దేశంలో.. క్రికెట్ వచ్చిందంటే అందరికీ ఎక్కడ లేని జ్వరాలు వచ్చేస్తాయి.. పని మానేసి స్టేడియంలో టికెట్లు సంపాదించేందుకు కుస్తీ పడతారు.. ఇళ్లలో, ఆఫీసుల్లో టీవీలకు అతుక్కు పోతారు.. ఈ వెర్రి జనాల కోసమే క్రికెట్ అంగడి సరుకైపోయింది.. ఆట ఎలా ఆడినా సరే క్రికెట్ ఆటగాళ్లకు భారీగా పారితోషికాలు వచ్చిపడుతున్నాయి.. ఇక స్పాన్సర్లు, ప్రకటనల ఆదాయం సరేసరి.. ఇప్పుడు ఈ ఆదాయం చాలదా అన్నట్లు క్రికెటర్లు అమ్ముడు పోవడం మొదలు పెట్టారు.. దీనికే బెట్టింగ్ అని ముద్దుపేరు.. ఆటగాళ్లు, బెట్టింగ్ గ్యాంగులు, మాఫియాలు కలిసిపోయి క్రికెట్ ఆటను అభిమానించే వారిని నిజంగానే వెర్రి వాళ్లను చేసేశారు..
ఇప్పడు చెప్పండి.. ఇలాంటి క్రికెట్ ను, ఆటగాళ్లును మనం ఇంకా ఆరాధించాలా.. క్రికెట్ ఇక్కటే ఆటనా? మిగతావేవీ ఆటలు కాదా?.. నిజానికి మన దేశం స్వాతంత్రానికి పూర్వం నుండి హాకీ ఆట ద్వారానే గుర్తింపు పొందింది.. ఒకప్పుడు హాకీలో ప్రపంచ దిగ్గజాలం మనం.. ఎన్నో స్వర్ణ పథకాలు తెచ్చుకున్నాం ఈ ఆటలో..  కానీ ఈ రోజున మన దేశంలో హకీ గుర్తింపు కోల్పోయింది..(ఇలా అనడం కన్నా క్రికెట్ మింగేసింది అంటే బెటర్)..
క్రికెట్ అంతర్జాతీయ క్రీడగా చెప్పుకుంటున్నా ప్రపంచంలేని ఎన్నో దేశాలు ఈ వెర్రి ఆట మత్తులో పడలేదు.. అగ్ర రాజ్యం అమెరికా, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాతో సహా పలు దేశాల్లో ఆ ఆటకు అసలు ఆదరణే లేదు.. ఈ కారణం వల్లే వారు ఒలింపిక్స్, ఏసియన్ గేమ్స్ లో కుప్పలు తెప్పలుగా పథకాలు సాధిస్తున్నారు.. క్రికెట్ వెర్రిలో పడి మనం ఇతర క్రీడల్లో ఒకటి అరా కాంస్యమో, రజతమో సాధించుకొని సంతృప్తి పడుతున్నాం.. 100 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశానికి ఎంతటి అవమానమో ఆలోచించారా?.. ఇకనైనా మేలు కుందాం.. క్రికెట్ మత్తులోంచి బయట పడదాం.. అన్ని ఆటలనూ ఆదరిద్దాం.. క్రికెటేతర క్రీడారంగంలో కూడా రానిద్దాం.. అంతర్జాతీయ క్రీడల్లో మన దేశ గౌరవాన్ని కాపాడుకుందాం..


No comments:

Post a Comment