Friday, December 2, 2016

మరీ అతి చేస్తున్న మమత..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరీ అతి చేస్తున్నారు.. ఆ రాష్ట్రం భారత దేశంలో భాగం కాదా?.. మన సైన్యం తనిఖీలు చేపడితే యాగీ చేయడం ఏమిటి?.. దేశ రక్షణ కోసం కంటికి రెప్పలా పోరాడుతున్న మన సైన్యానికి దేశంలో ఎక్కడికైనా వెళ్లుతుంది.. సైన్యం ఏమైనా బెంగాల్ లో సాధారణ పౌరులకు ఇబ్బంది కలిగిస్తే, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఒక ముఖ్యమంత్రిగా మమతకు పూర్తి హక్కు ఉంది.. కానీ నల్లధనంపై పోరాటం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీపై కోపంతో సైన్యంపై కూడా రాజకీయ విమర్శలు చేయడం దారుణం..

నిన్న విమాన ల్యాండింగ్, ఇవాళ సైన్యం మొహరింపు.. ఈ రెండు అంశాలను ఆమె రాజకీయం చేయడం ద్వారా సెల్ప్ గోల్ చేసుకున్నారు.. మమతా బెనర్జీకి చిత్త శుద్ధి ఉంటే బెంగాల్ లో దొంగనోట్లను అరికట్టాలి.. శారదా కుంభకోణంపై దర్యాప్తు జరపాలి,, బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరబాట్లను అరికట్టాలి.. అంత ధైర్యం ఆమెకు ఉందంటారా?

No comments:

Post a Comment