Thursday, August 25, 2016

*మోదీ వైపు బలూచీల చూపు.. ఖంగుతిన్న పాక్

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న పాకిస్తాన్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టి ఝలకే ఇచ్చారు.. స్వాతంత్ర్య దినోత్సవ దినోత్సవ ప్రసంగంలో బలూచిస్తాన్ లో పాకిస్తాన్ ఆగడాలను మోదీ ప్రస్థావించడం తెలిసిందే. పాకిస్తాన్ నుండి వేరు పడేందుకు దశాబ్దాలుగా పోరాడుతున్న బలూచీలకు భారత ప్రధాని సంఘీభావం పలకడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది..
తమ పోరాటాన్ని భారత ప్రధాని గుర్తించడంతో బలూచ్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. మోదీకి ధన్యవాదాలతో ప్రదర్శనలు చేపట్టారు. తమ పోరుకు భారత్ సహకారంలపై వారు గంపెడాశలు పెట్టుకున్నారు.
పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నసీరాబాద్, డేరాబుగ్తీ, సుయ్, జాఫరాబాద్ తదితర ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి. పాకిస్థాన్ జెండాలను కింద పడేసి తొక్కుతున్నారు.  ముషారఫ్ హయాంలో హత్యకు గురైన బలూచీ నేత అక్బరుద్దీన్ భుగ్తీ,నరేంద్ర మోదీ ఫొటోలు, భారత జాతీయ పతాకాలు పట్టుకుని ప్రదర్శనలు జరుపుతున్నారు. మోదీ సహకరిస్తే బంగ్లాదేశ్‌లా బలూచిస్తాన్ కూడా స్వతంత్ర్యదేశంగా ఏర్పడుతుందని వారు ఆశలు పెట్టుకున్నారు. చూడబోతే పాకిస్తాన్ ఎక్కువ కాలం మనుగడలో ఉండే అవకాశాలు కనిపించం లేదు. సింధ్ లో కూడా ఎప్పటి నుండో సింధ్ దేశ్ కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో గిరిజన తెగలు చాలా కాలంగా పాక్ సైన్యంతో పోరాడుతున్నాయి.. పీవోకే భారత్ లో కలిస్తే పాకిస్తాన్ ఇక పశ్చిమ పంజాబ్ రాష్ట్రంకే పరిమితం..

No comments:

Post a Comment