Tuesday, August 16, 2016

పాక్ ఆటలు ఇక సాగవు..

పిచ్చి కుక్కను అలాగే వదిలేస్తే వెంటబడి కరుస్తుంది.. కర్రతో గట్టిగా ఒకటిచ్చుకోవాల్సిందే.. పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్ లో వేర్పాటు వాదానికి ఆజ్యం పోయడం, ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ మన దేశంపై ఉసిగొల్పం బహిరంగ రహస్యమే..

కశ్మీర్ లో ఏదో జరిగిపోతోందని గోబెల్స్ ప్రచారం చేస్తున్న పాక్ పాలకులు ఆక్రమిత కశ్మీర్ లో మానవ హక్కుల విషయాన్ని మాత్రం ప్రస్థావించరు.. అక్కడి ప్రజల తిరుగుబాటును కర్కషంగా అణచివేస్తున్నారు.. బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఏర్పాటుకు ముందు నుంచే స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు.. గురవింద తమ కింద మచ్చెరగదు అన్నట్లు, తమ దేశంలో జరుగుతున్న అరాచకాలను దాచిపెట్టి కశ్మీర్ విషయంలో ప్రతి సందర్భంలోనూ అంతర్జాతీయ వేదికలపై కోడై కూస్తోంది పాక్..
ఈ విషయంలో భారత నాయకులు మౌనం పాటిస్తుంటే, అవతలి వారికి మౌనం అర్ధాంగీకారం అనే సందేశం పోతోంది.. దాల్ మే కుచ్ కాలా హై..’ అందుకే ఇండియా కశ్మీర్ విషయంలో గట్టిగా మాట్లాడలేకపోతోందని తటస్త దేశాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి.. ఈ అపవాదును అనవసరంగా భరించాల్సిన అవసరం మనకేమిటి? అందుకే ప్రధాని నరేంద్ర మోదీ మన విదేశాంగ విధానాన్ని సమూలంగా తిరగేస్తున్నారు..
రెండు రోజుల క్రితం పాకిస్తాన్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ దేశ పాలకులు కశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తారు.. దీనికి ధీటైన సమాధానం ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట మీద నుండి ఇచ్చారు.. ఆక్రమిత కశ్మీర్, బలూచిస్తాన్ రాష్ట్రంలో పాక్ అవలంభిస్తున్న విధానాలను, ఉగ్రవాదం విషయంలో అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిని గట్టిగా ఎండగట్టారు.. పాకిస్తాన్ ఇకపై కశ్మీర్ గురుంచి మాట్లాడే ముందు ఆక్రమిత కశ్మీర్, బలూచిస్తాన్ ల గురుంచి కూడా సమాధానం ఇచ్చుకోవాలి.. లేదా నోరు మూసుకోవాలి..

బలూచిస్తాన్ స్వాతంత్ర్య సమరయోధులకు భారత్ సాయం చేస్తోందని ఆరోపిస్తున్న పాక్, ఇందుకు ఆధారాలను మాత్రం చూపలేకపోయింది.. కానీ భారత్ లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పానికి మన దగ్గర బోలెడు ఆధారాలు ఉన్నాయి.. ఇకనైనా పాకీల పాచి పాటకు, కాకిగోలకు ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిద్దాం.. లేకుంటే అది వారి కర్మ.. మనకు ఎలాగూ మోదీ అస్త్రం ఉంది.. 

No comments:

Post a Comment