Sunday, August 21, 2016

ప్రోత్సహించండి.. కానీ..

సింధు ఒలింపిక్స్ లో పతకం తెచ్చింది.. దేశ ప్రజలంతా ఆనందించారు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వాలు, ప్రజలు సింధు విజయాన్ని తమ రాష్ట్రాలకు గర్వకారణంగా చెప్పుకోవడంలో తప్పు లేదు.. కానీ ఇక్కడ కులం ప్రసక్తి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు.. సింధు తాను పలానా కులం ప్రతినిధిగా ఒలింపిక్ గేమ్స్ కు వెళుతున్నానని చెప్పిందా?.. లేదే.. మరి ఎందుకు ఈ కులం గోల?..
ఇక కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఏపీ, ఢిల్లీ ప్రభుత్వాలు ఎంతో ఉదారంగా సింధుకు నజరానాలు ప్రకటించాయి.. సంతోషమే.. కానీ ఇవి ఆచరణలో చూపించండి.. గతంలో కొందరు క్రీడాకారులకు ప్రకటించిన బహుమతులు, ఇళ్ల స్థలాలు, భూకేటాయింపులు ఇప్పటి వరకూ అందని ఉదాహరణలు ఉన్నాయి..
అయినా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు కావాలి కానీ ఈ నజరానాలు ఎందుకు?.. విజేతలను ఘనంగా సత్కరించండి.. అభినందించండి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించండి.. క్రీడారంగ వికాసానికి మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయండి.. కొత్త క్రీడాకారులను తయారు చేయండి.. ఇంతకు మించిన నజరానాలు ఇంకేముంటాయి?.. మనకు మరింత మంది సింధులు కావాలి..

No comments:

Post a Comment