Thursday, April 20, 2017

చైనాకు బుద్ధి చెప్పాల్సిందే..

ఓ మోతుబరి ఆసామి పక్కనే ఉన్న చిన్న రైతు పొలాన్ని ఆక్రమించాడు.. ఆ తర్వాత దాని పక్కన ఉన్న మరో ఆసామి పొలంపై కన్నేశాడు.. పొలం గట్ల దగ్గర వివాదం సృష్టించి, అవి తనవేనని చాటుకొని పెత్తనం చేస్తున్నాడు..
చైనా తీరు కూడా ఇలాగే ఉంది.. అన్యాయంగా స్వతంత్ర టిబెట్ దేశాన్ని అక్రమించి కలిపేసుకుంది.. టిబెట్ ను ఆనుకొని ఉన్న భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ భూభాగాలు తనవేనని దబాయిస్తోంది.. అవి దక్షిణ టిబెట్ లోని భాగాలని దబాయిస్తోంది.. అసలు టిబెట్టే చైనాది కానప్పుడు, ‘దక్షిణ టిబెట్’ అనే వాదనలో పస ఉందా?.. ఇక్కడే భారత్ ఇరకాటంలో పడుతోంది..
1949లో టిబెట్ పై దురాక్రమణ చేసి ఆక్రమించినప్పుడు అందరికన్నా ముందు సమర్ధించి, చైనాకు దానిపై హక్కును గుర్తించింది జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వమే..  ‘హిందీ-చీనీ భాయ్ భాయ్’ అంటూ చైనాతో మైత్రి చైశారు నెహ్రూ. మరోవైపు తాను శాంతి దూతగా పేరు తెచ్చుకోవలని తపనతో దలైలామాకు భారత్ లో ఆశ్రయం ఇచ్చారు నెహ్రూ..
ఈ ద్వంద్వ విదేశాంగ నీతే భారత్ ప్రయోజనాలకు ముప్పుగా మారింది. భారత్ తో చైనా యుద్దం, జమ్మూ కశ్మీర్ లోని అక్సాయ్ చిన్ దురాక్రమణ, అరుణాచల్ ప్రదేశ్ వివాదం.. భారత్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు బహిరంగంగా బాసటగా నిలిచింది చైనా వీటన్నింటికీ నెహ్రూ విధానాలే వారసత్వ శాపంగా కొనసాగుతున్నాయి..

ఇప్పటి వరకూ ఉన్న ప్రభుత్వాలన్నీ చైనాను దారిలో పెట్టలేకపోయాయి.. కనీసం నరేంద్ర మోదీ ప్రభుత్వమైనా చైనాతో మనకు ఉన్న సమస్యను పరిష్కరిస్తుందని ఆశిద్దాం..

No comments:

Post a Comment