Monday, April 17, 2017

సంఘంతో బాబాసాహెబ్ అనుబంధం

ఈరోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకుంటూ కొన్ని సంఘాలు, సంస్థలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, పరివార్ సంస్థలపై విమర్శలు, దాడులు చేస్తున్నాయి.. నిజానికి అంబేద్కర్ సంఘంలో మంచి సంబంధాలను నెరిపారు..
బాబాసాహెబ్ కు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ తో మంచి పరిచయం ఉంది.. 1939 ఏప్రిల్ 21వ తేదీన పూణేలో జరిగిన సంఘ శిబిరాన్ని సందర్శించారు.. అక్కడ స్వయం సేవకులు ఎలాంటి అస్పృశ్యతను పాటించకుండా కలిసి మెలిసి ఉండటం చూసి ఆనందం వ్యక్తం చేశారు..  ఈ సందర్భంగా అంబేద్కర్‘అస్పృశ్య వర్గాల ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలు- హిందూ సమాజం బాధ్యత’అన్న అంశంపై  ప్రసంగించారు.

మరో సందర్భంలో ఆర్‌ఎస్‌ఎస్‌. సంక్రాంతి ఉత్సవానికి కూడా అంబేద్కర్ హాజరయ్యారు. సామాజిక సమత నిర్మాణం,అస్పృశ్యతా నిర్మూలనకు సంఘం చేస్తున్న ప్రయత్నాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.1956లో అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని తీసుకునే సమయంలో ఆర్ఎస్ఎస్ నాయకులు మోరోపంత్‌ పింగళే, దత్తోపంత్‌ ఠేంగ్డీ లు కలిసారు. వారితో తాను బౌద్ధధర్మం తీసుకోవడానికి గల కారణాలను బాబాసాహెబ్ చర్చించారు.  ‘సంఘం చేస్తున్న పని నాకు తెలుసు, దేశంలో జనాభా పెరుగుతున్న వేగంతో పోలిస్తే సంఘం పెరుగుదల వేగం తక్కువగా ఉంది. నేను పెద్దవాణ్ణి అయ్యాను. ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్న దళిత అనుచరులకు నేనుండగానే సరియైన మార్గాన్ని చూపాలి. అందుకే బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తున్నాను’ అని వివరించారు.

No comments:

Post a Comment