Sunday, April 30, 2017

సోషల్ మీడియా విశ్వసనీయత కోల్పోవద్దు..

దున్నపోతు ఈనింది అని ఒకడు అంటే, దూడను కట్టేయండ్రా అంటూ స్పందించాడట మరొకడు..
ప్రస్తుతం సోషల్ మీడియా తీరు ఇలాగే ఉంది.. రాందేవ్ బాబా విషయంలో ఇప్పుడు జరిగింది ఇదే.. వార్త నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే ఎవరో మార్ఫింగ్ చేసి పంపిన ఫోటోలను గుడ్డిగా ఫార్వర్డ్ చేసేశారు.. చివరకు వాస్తవం తెలుసుకొని నాలిక కరచుకున్నారు.. 
ఇలాంటి కారణాలు చూపించే ప్రభుత్వాలు సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలంటూ కారాలు మిరియాలు నూరుతుంటాయి.. సోషల్ మీడియాకు స్వీయ నియంత్రణ ఆవశ్యకతను ఈ ఘటన గుర్తు చేస్తుంది..
26.04.2017

No comments:

Post a Comment