Sunday, April 30, 2017

కేజ్రీవాల్ కు చెంపపెట్టు

అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.. బాసలెన్నో చేసి ఆశలు పెంచాడు.. అవన్నీ అడియాశలైపోయాయి.. ఈయన అరవింద కాదు, గురవింద అని తెలుసుకున్నారు హస్తిన జనం.. ఎంసీడీ ఎన్నికల్లో చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారు..

ఏదో చేస్తానని వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ.. ఊకదంపుడు ఉపన్యాసాలు, వాగ్దానాలు ఇచ్చేసింది.. కొత్త పార్టీపై ఢిల్లీ ప్రజలు ఆశలు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగనంత మెజారిటీతో అధికారం అప్పగించారు.. కానీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసింది ఏమిటి? పరిపాలన గాలికి వదిలేసి ఎప్పుడూ ప్రధానమంత్రి మోదీని ఆడిపోసుకోవడం.. ఆయన విద్యార్హతలు ఏమిటా అని ఆరా తీయడం.. కేంద్రం, లెఫ్టినెంట్ జనరల్ సహకరించడం లేదంటూ గిల్లీ కజ్జాలు పెట్టుకోవడం.. ఢిల్లీ గల్లీల్లో జనం గోడును పక్కన పెట్టి జాతీయ, ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో తల దూర్చడం..
రాజకీయాలను ప్రక్షాళన చేస్తానంటూ వచ్చిన ఆమ్ ఆద్మీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో చాలా మందికి నేర చరిత ఉండటం, కేసుల్లో ఇరుక్కోవడం చూస్తుంటే వారి స్వచ్ఛత ఏపాటిదో అర్థమవుతోంది..ఇది ఆప్ కాదు, పాప్ అని హస్తినవాసులకు అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.. అందుకే ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం.. భాజపా విజయకేతనం..
ఇంత జరిగినా కేజ్రీవాల్ లో మార్పు రాలేదు.. తప్పంతా ఈవీఎంలదే అంటూ అరగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డును మళ్లీ వినిపిస్తున్నాడు.. హుమ్.. మారడు గాక మారడీయన (27.04.17)

No comments:

Post a Comment