Monday, April 3, 2017

సత్యం బాబుకు జరిగింది న్యాయమేనా?

గ‌డ‌చిన కాలం, తరిగిన జీవితం తిరిగి రావు..
ఎనిమిదేళ్లు అంటే ఒక మ‌నిషి జీవితంలో ఎంతో విలువైన స‌మ‌యం.. అది నాలుగు గోడ‌ల మ‌ద్య గ‌డ‌చిపోవ‌డం, అందునా చేయ‌ని నేరానికి శిక్ష అనుభ‌వించ‌డం అంటే దారుణం.. వంద మంది దోషులు త‌ప్పించుకున్నా, ఒక్క నిర్దోషికి అన్యాయం జ‌ర‌గొద్ద‌ని చెబుతున్నాయి మ‌న చ‌ట్టాలు.. కానీ న్యాయ స్థానాల్లో వాజ్యాలు ఏళ్ల త‌ర‌బ‌డి న‌డుస్తుంటే, చివ‌ర‌కు తీర్పు ఎలా వ‌స్తుందో తెలియ‌క ఎంతో మంది అమాయ‌కులు అన్యాయంగా జైళ్ల‌లో మ‌గ్గిపోతుంటే ఇలాంటి హితోక్తులు ఎలా వ‌ళ్లించ‌గ‌లం?
స‌త్యం బాబు అన‌గానే అయేషా మీరా హ‌త్య కేసులో నిందితుడు క‌ళ్ల ముందు క‌ద‌లాడాడు.. కాపాలా జ‌వాన్ల మ‌ధ్య‌ కోర్టుకు, జైలుకు తిప్పుతుంటే దీనంగా అల్లాడిపోతూ క‌నిపించిన దృశ్యాల‌ను ఇంకా మ‌ర‌చిపోలేదు.. అదంతా ఓవ‌ర్ యాక్ష‌న్ అని పోలీసులు చెప్పేవారు.. కానీ ఇప్పుడు స్ప‌ష్ట‌మైపోయింది ఓవ‌ర్ యాక్ష‌న్ చేసింది పోలీసులేన‌ని.. స్వ‌యాన హ‌తురాలి త‌ల్లి సైతం స‌త్యంబాబు నేరం చేశాడంటే న‌మ్మ‌లేదు.. త‌న కూతురు మ‌ర‌ణించింద‌నే వ్య‌ధను ప‌క్క‌న పెట్టి నిర్దోషికి శిక్ష ప‌డొద్ద‌ని ఆమె సైతం త‌పించింది..
అన్యాయంగా జైలులో మ‌గ్గిపోయిన స‌త్యంబాబుకు రూ.1,00,000 చెల్లించ‌మంది ఉన్నత న్యాయస్థానం.. ఈ రోజుల్లో ఒక కూలీ రోజుకు రూ.

.200 పైగానే సంపాదిస్తున్నాడు. ఇంత కాలంగా స‌త్యం బాబు కుటుంబం కోల్పోయిందెంతో లెక్క‌గ‌డితే?.. ముష్టి ల‌క్షేనా అని అనిపిస్తుంది.. డ‌బ్బు విష‌యాన్ని ప‌క్క‌న పెడితే ఆ కుటుంబానికి క‌లిసిన మాన‌సిక వ్య‌ధ‌, అవ‌మానాల‌కు ప‌రిహారం ఎవ‌రిస్తారు? నేను ఇక్క‌డ న్యాయ వ్య‌వ‌స్థ‌ను త‌ప్పు ప‌ట్ట‌లేను.. కానీ చ‌ట్ట ప‌రిదిలో జ‌రిగిపోతున్న అన్యాయాన్ని చూసి త‌ట్టుకోలేక పోతున్నాను..

No comments:

Post a Comment