Saturday, February 23, 2013

ఉగ్రవాద నగ్న స్వరూపం

దిల్ సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ల దుర్ఘటన తర్వాత ఉగ్రవాదుల నగ్న స్వరూపం దేశ ప్రజలందరికీ మరోసారి తెలిసి వచ్చింది.. ఉగ్రవాదం అనేది ఒకరకమైన మానసిక వికృత చర్య తమ భావాలను ఇతరులపై బలవంతంగా నెట్టేందుకో, పంతాన్ని నెగ్గించుకోవడాకి ఎలాంటి దారుణమైన హత్యలుకైనా పాల్పడేందుకు సిద్దపడే పైశాచిక స్వభావులే ఉగ్రవాదులు.. అవసరమైతే తమకు తాము మానవ బాంబులుగా మారి తాము చచ్చీ, అవతలి వారిని చంపి తామేదో ఘన కార్యానికి అంకితమౌతున్నామని సమాధానపరచుకుంటారు..
ఉగ్రవాదానికి జాతి, మతం, కులం, వర్గం, భాష, ప్రాంతం లేదనేది నిజం.. కానీ కొందరు దర్మార్గులు జిహాద్ పేరిట భయోత్పాతాన్ని సృష్టిస్తూ ఉగ్రవాదాన్ని ఒక మతానికి ఆపాదించేస్తున్నారు.. నిజానికి మన దేశంలో ఉన్న ఆ మతస్తుల్లో అత్యధికులు ఉదారస్వభావులే.. ఈ దేశాన్ని ప్రేమించేవారే.. దేశ విభజన జరిగిన సమయంలో వారంతా తాము పుట్టి పెరిగిన భారత్ దేశమే కావాలనుకున్నారు.. కానీ తులసి వనంలో గంజాయి మొక్కల్లా అతి కొద్ది మంది జిహాద్ పేరిట రెచ్చగొడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారు.. అయితే ఉగ్రవాదం ఒక మతానికి మాత్రమే పరిమితం అని నేను వాదించడం లేదు.. ఉగ్రవాదులు హిందూ మతంతో సహా అన్ని మతాల్లోనూ ఉన్నారు.. ఉగ్రవాదాన్ని మెజారిటీ, మైనారిటీ అనే దృష్టితో చూడరాదు..
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటు తనం, చదువు లేక పోవడమే వేర్పాటు భావనలను సృష్టిస్తుందని కొందరు మేధావులు తేల్చేస్తుంటారు.. కానీ నా పరిశీలన ప్రకారం చదువుకున్న మేధావులు, అంతో ఇంతో స్థితి మంతులు అయినవారు, సామాజికంగా కొంత పలుకుబడి ఉన్న వారే అధికంగా ఉగ్రవాద భావాలకు ఆకర్శితులవుతున్నారు.. వ్యాప్తి చేస్తున్నారు కూడా.. ఇందుకు నేను ఎన్నో ఉదాహరణలు చూపగలను..
ఈ దేశంలో పుట్టి, ఇక్కడి తిండి తింటూ, స్వేచ్ఛను అనుభవిస్తూనే తామేదో అన్యాయానికి గురవుతున్నామని చెప్పుకునేవారు కచ్చితంగా దేశ ద్రోహులే.. ఇలాంటి వారందరికీ పొరుగు దేశం ఏదో స్వర్గం అనే భావన ఉంది.. కానీ మతం పేరిట ఏర్పడ్డ ఆ దేశంలో వర్గాలు, తెగల పేరిట ఎంతగా కొట్టుకు చస్తున్నారో ప్రతి నిత్యం మనం పత్రికల్లో టీవీల్లో చూస్తూనే ఉన్నాం.. తమ దేశంలో ఉన్న అరాచకాన్ని పుచ్చుకోవడానికి వారు మన దేశంలో హింసను రగిలిస్తున్నారు..

ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిని, ప్రోత్సహించేవారిని కఠినంగా శిక్షించాల్సిందే.. వీరికి ఉరికన్నా కఠినమైన శిక్షలే విధించాలి.. దురదృష్టవశాత్తు మన దేశంలో ఉగ్రవాదులకు, దేశ ద్రోహులకు, దేశ ద్రోహులకు వంతపాడేవారే మేధావులు(అసలు వీరిని అలా పిలవవచ్చా?) ఉన్నారు.. వీరి పైశాచిక ఆనందానికి అమాయక పౌరులు చనిపోయినప్పుడు ఈ మేధావుల నోళ్లు పెగలవు.. కానీ వారికి శిక్షపడ్డప్పుడో, ఎన్ కౌంటర్లో చనిపోయినప్పుడో గొంతు చించుకొని అరుస్తారు.. దిల్ సుఖ్ నగర్ లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వీరి నోళ్లు మూబోతాయెందుకో?.. అఫ్జల్ గురు ను ఉరి తీసినప్పుడు చర్చ చేసిన వారు ఇప్పుడు ఎందుకు చప్పుడు చేయరు? అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారమే దిల్ సుఖ్ నగర్ హత్యాకాండ అనే విషయం తెలిసి తేలు కుట్టిన వారిలా వ్యవహరిస్తున్నారా?

No comments:

Post a Comment