Sunday, February 17, 2013

తొమ్మిదేళ్లు.. తొమ్మిది పాపాలు


కుంభకోణాల మీద కుంభకోణాలు.. 9 ఏళ్ల పాలనలో 9 కుంభకోణాలు.. ఒక కుంభకోణం మరువక ముందే మరో కుంభకోణం..
ఓటుకు నోటు, 2జీ, ఆదర్శ్ హౌసింగ్, కామన్ వెల్త్ క్రీడలు, బొగ్గు గనుల కేటాయింపు, ఎస్ బ్యాండ్, జాతీయ ఉపాధి హామీ పథకం, విదేశాల్లో నల్ల ధనం.. చివరకు ఇప్పడు అగస్టా హెలిక్యాప్టర్ల కుంభకోణం..
ఇదేనా యూపీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతి.. ఏ కుంభకోణంపైనా విచారణ కొలిక్కి రాలేదు.. తూతూ మంత్రం లాంటి విచారణలు.. అవినీతిపై ప్రతి పక్షాలు నిలదీసినా చర్యలు తీసుకోవడం దేవుడెరుగు.. ఎదురు దాడే కాంగ్రెస్ నేతల సమాధానం..
ఉలుకూ, పలుకు లేని మౌనీ బాబా మన్మోహన్ గుడ్డి దర్బారులో అవినీతి బేషుగ్గా రాజ్యమేలుతోంది.. దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన గొప్ప ఆర్థిక వేత్తగా పేరొందిన మన్మోహన్జీ హయాంలో ధరలు ఆకాశాన్ని అంటుతూ పేదలు బతకడమే గగణమైపోయింది.. పేదలు మరింత పేదలు అవుతుంటే.. ధనికులు ఆస్తులు ఎన్నో రెట్లు పెరిగిపోతున్నాయి..  ఇవేమీ పట్టని పాలకులు దేశ సంపదను అడ్డంగా దోచుకుంటున్నారు..
ఇప్పుడు తొమ్మిదేళ్ల పాలన అయిందేదో అయింది, కొత్తగా యువరాజు వచ్చి ఏదో కుళ్లపొడుస్తాడని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు..  ఇంతకాలంగా కొనసాగిన అనర్థాలన్నింటికీ మనన్మోహన్ సింగ్ ను బాధ్యున్ని చేసేసి.. అధినేతి సోనియమ్మవారు ప్రెష్ లుక్ పేరుతో రాహుల్ గాంధీని తెరపైకి తెరపైకి తెస్తున్నారు.. అంటే ఇంత కాలంగా కొనసాగుతున్న అసమర్థ పాలనకు కాంగ్రెస్ పాలకులు మూల్యం చెల్లించనక్కరలేదా?
ప్రజలు వెర్రివాళ్లు కాదు.. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, యూపీఏకు కచ్చింతంగా కర్రు కాల్చి వాత పెడతారు..

No comments:

Post a Comment