Friday, November 8, 2013

ఇద్దరు సీఎంలూ.. స్పందనలు..

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు దాడి చేసి కాంగ్రెస్ అగ్ర నేతలను, కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు.. అనేక మందిని గాయపరిచారు..
బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ బహిరంగ సభలో పలు చోట్ల ఉగ్రవాదులు బాంబులు పేల్చారు.. కొందరు కార్యకర్తలు చనిపోగా, ఎంతో మంది గాయపడ్డారు..
ఈ రెండు సంఘటనల సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల స్పందన ఎలా ఉందో చూడండి..
ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని బాధితులను పరామర్శించి వారికి అన్ని రకాలుగా ఆదుకునే చర్యలు చేపట్టారు.. బాధితులు కాంగ్రెస్ వారైనా ఎలాంటి వివక్ష చూపలేదు..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఇదేమీ పట్టలేదు.. ఇటీవలి దాకా మిత్ర పక్షంగా ఉన్న బీజేపీకి చెందిన బాధితులను పరామర్శించడానికి నామోషీ అడ్డం వచ్చింది.. పైగా ఆరోజున విందూ వినోదాల్లో గడిపారనే ఆరోపణలు ఉన్నాయి..
రెండూ ఉగ్రవాద సంఘటనలే.. ఇద్దరూ ముఖ్యమంత్రలే.. కానీ వారి స్పందనలో ఎంత తేడా ఉందో గమనించారా?

No comments:

Post a Comment