Thursday, November 7, 2013

ఈ భారం ఎవరు భరించాలి?..

బస్సు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.. ఆర్టీసీ ఛార్జీలు నడ్డి విరుస్తున్నాయి.. హైదరాబాద్ సిటీ బస్సు కనీస టికెట్టు ధర రూ.6.. ఒక స్టేజీ ప్రయాణానికే ఇంత చెల్లించాల్సి రావడం దారుణమే.. ఇక దూర ప్రాంతాల బస్సు ఛార్జీలు ఆకాశాన్నంటి పోయాయి.. నష్టాలను భర్తీ చేసుకోడానికే ఛార్జీలు పెంచామని ఆర్టీసీ చెబుతోంది.. నిజమే కదా?..
ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఉభయ ప్రాంతాల ఉద్యమకారులు, ఆర్టీసీ కార్మిక సంఘాలు కాదా? రోజుల తరబడి బందుల పేరుతో ఆర్టీసీని దివాలా అంచుకు తెచ్చారు.. అదే సమయంలో రాజకీయ నాయకులకు చెందిన ప్రయివేటు బస్సులు ప్రయాణీకులకు అడ్డగోలుగా లూఠీ చేశాయి..  లాభాలు నాయకులకు, నష్టాలు ఆర్టీసీకా?..

ఉభయ ప్రాంతాల ఉద్యమకారులు ఒక్కసారి ఆలోచించండి.. మీ అనాలోచిత నిర్ణయం సామాన్య ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టింది.. ఒకనైనా ఉద్యమాల నుండి సామాన్యుని ప్రయాణ సాధనమైన ఆర్టీసీని మినహాయించండి..

No comments:

Post a Comment