Saturday, November 30, 2013

'గొప్ప' కుటుంబంలో పుట్టక పోవడమే పాపమా?

 ఇంద్రకుమార్ గుజ్రాల్.. ఈయన ఎంత మందికి గుర్తున్నారు.. నేటి తరానికి ఈయన తెలియదంటే అందుకు వారిని తప్పుపట్టలేం.. ఎందు కంటే మన దేశంలో మన దేశంలో గాంధీ, నెహ్రూ కుటుంబంలో పుట్టిన వారే గొప్పవారు.. వారే ఈ దేశ పాలకులు.. చరిత్ర వారినే గుర్తిస్తుంది.. ఈ కుటుంబానికి ఛెందని వారు ఎంత గొప్పవారైనా చరిత్రకు పట్టదు..
సంకీర్ణ ప్రభుత్వాల హవా ప్రారంభమయ్యాక దేవగౌడ తర్వాత ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించారు ఐకే గుజ్రాల్.. జీలం(ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది)లో పుట్టిన గుజ్రాల్ భారత స్వాతంత్ర్య సమర పోరాటంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.. ఇందిరా గాంధీ క్యాబినెట్లో సమాచార శాఖ మంత్రిగా పని చేశారు.. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరకు అనుకూలంగా ఏకపక్ష వార్తల విషయంలో సంజయ్ గాంధీతో విభేదించడంతో గుజ్రాల్ ను తప్పించి వీసీ శుక్లాను నియమించారు.. ఆ తర్వాత గుజ్రాల్ రష్యా రాయభారిగా వెళ్లారు.. వీపీ సింగ్, దేవెగౌడ సంకీర్ణ ప్రభుత్వాల్లో విదేశాంగ మంత్రిగా సేవలు అందించారు.. ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి వరించింది..
ఇంతకీ గుజ్రాల్ గారిని ఎందుకు గుర్తు చేస్తున్నానంటారా? అసలు విషయానికి వద్దాం..
ఇంద్ర కుమార్ గుజ్రాల్ మరణించి నేటికి ఏడాది అవుతోంది.. ఢిల్లీలో ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.. అయితే ఆయన సమాధిని మాత్రం దిక్కూ, లేకుండా అనామకంగా సిమెంట్ గచ్చుతో వదిలేశారు.. ఈ పరిస్థితికి నొచ్చుకున్న గుజ్రాల్ కుటుంబం, అరుణ్ జైట్లీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి లేఖ కూడా రాశారు.. తామే ఖర్చు భరించి సమాధిని అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు.. కానీ సింగ్ గారి రాతి గుండె స్పందించలేదు.. మరోవైపు ఇందిగాంధీ సమాధి శక్తిస్థల్, రాజీవ్ గాంధీ సమాధి వీర్ భూమి బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాయి.. ఎందుకంటే వారు ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టినవారు కదా?..
ఇదంతా చదువుతుంటే మన పీవీ నరసింహారావు గారు గుర్తొస్తున్నారా? ఐదేళ్లు దేశానికి ప్రధానిగా పనిచేసి ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసిన పీవీకి కనీసం ఢిల్లీలో అంత్యక్రియలు జరిపే అవకాశం కూడా ఇవ్వలేదు సోనియా గాంధీ.. ఆయన శవాన్ని ఏఐసీసీ కార్యాలయం లోపలికి కూడా అనుమతించకుండానే హైదరాబాద్ పంపేశారు.. ఇక్కడ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆయన శవం కూడా సరిగ్గా కాలకుండా జాగ్రత్తలు తీసుకొని సోనియా విధేయతను చాటుకుంది.. ఆయన సమాధి ప్రాంగణాన్ని అనామకంగా వదిలేశారు..
పీవీజీ, గుజ్రాల్జీ చేసిన పాపం ఏమిటి? వారు కూడా దేశానికి ప్రధానులుగా సేవలు చేశారు కదా?.. వారి సమాధులకు ఎందుకు ఈ దుర్గతి?

No comments:

Post a Comment