Thursday, May 26, 2016

మోదీజీ హమ్ తుమారే సాథ్ హై..

ఇదేం ప్రభుత్వమండీ.. ఒక్క కుంభకోణం లేదు.. అవినీతి ఆరోపణలు లేవు.. లాబీయిస్టులను పక్కన పెట్టారు.. ఆర్థిక రంగంలో దేశం దూసుకుపోతోంది.. చైనాను కూడా దాటి పోతున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి.. మేకిన్ ఇండియా కొత్త పుంతలు తొక్కుతోంది.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి.. ఉపాధి అవకాశాలు పెరిగాయి.. ముద్రయోజన, స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా ఈ దిశలో భాగమే..
రెండేళ్ల పాలనలో జనానికి ఒరిగింది ఏమిటి?.. అచ్చే దిన్ ఏమైంది?.. ప్రజల జీవన స్థితిగతులు మారాయా?.. విదేశాల నుండి నల్ల ధనం వెనక్కి వచ్చిందా?.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించారా?.. గుడ్డు మీద ఈకలు పీకే వారు ఇలాంటి ప్రశ్నలు చాలా వేస్తారు.. పండుగ చేసుకోవాలంటే ముందు ఇంట్లో దుమ్ము దులిపి చెత్తను ఊడ్చేయాలి.. గుమ్మానికి తోరణాలు కట్టి, ముగ్గులు వేసుకోవాలి.. ఈలోగా పిల్లలు ఆకలి అంటూ మారం చేయడం సహజం.. ఆ తర్వాత తీపి వంటకాలు ఆస్వాదించేది ఎవరు?.. ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఇలాగే ఉంది..
ఇంతలోగా నిరాశ పడనక్కరలేదు.. జన్ ధన్ యోజన, సురక్ష బీమా, జీవన్ జ్యోతి పాలసీలు, ధనికుల వంటగ్యాస్ రాయితీ ఉపసంహరణ, ఇంకా సంక్షేమ కార్యక్రమాలు వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ది కలిగిస్తున్నాయి.. అన్నింటికన్నా ముఖ్యమైనది సమాజ నిర్మాణంలో ప్రజలందరినీ భాగస్వాములను చేసిన స్వచ్ఛ భారత్..
ప్రధాని విదేశీ పర్యటనలపై కూడా విమర్శలు ఉన్నాయి.. ఆయన ఇప్పటి వరకూ చేసిన నిష్ప్రయోజన పర్యటన ఏదైనా ఉంటే చూపగలరా?.. అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట పెరగలేదా?.. వివిధరకాల ఒప్పందాలతో దేశానికి ప్రయోజనాలు కలగడంలేదా?..
విమర్శించడం ప్రతిపక్ష లక్షణం.. కానీ అంది దేశాభివృద్ధిని, సంక్షేమాన్ని అడ్డుకునేదిగా ఉండరాదు.. గోటితో పోయే ప్రతీ అంశాన్ని పట్టుకొని భూతద్దంలో చూపి రాద్ధాంతం చేయడం వళ్ళ ఎవరికీ ప్రయోజనం ఉండదు.. ఇలాంటి వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. వీరంతా వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమైనా ఇంత పారదర్శకంగా, ఇంతవేగంగా పని చేసిందా?
ప్రధానమంత్రిగా రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న నరేంద్రమోడీకి అభినందనలు.. భారత దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రశక్తిగా తీర్చిదిద్దుతిన్న మీకు ప్రజల అండదండలు ఎల్లవేళలా ఉంటాయి..
లాగేరహో మోదీజీ.. హమ్ తుమారే సాథ్ హై..

No comments:

Post a Comment