Monday, May 16, 2016

అసలు గాంధీ..

భార‌త స్వాతంత్ర్య స‌మ‌ర ఉద్య‌మంలో భాగంగా మ‌హాత్మా గాంధీ ఉప్పు స‌త్యాగ్ర‌హం చేప‌ట్టిన విష‌యాన్ని చ‌రిత్ర‌లో చ‌దువుకున్నాం.. ఉప్పు స‌త్యాగ్ర‌హం చేస్తున్న గాంధీజీ చేతిక‌ర్ర‌ను ఓ కుర్రాడు ప‌ట్టుకొని లాక్కుపోతున్న దృశ్యం చారిత్రిక ఛాయా చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది..
ఈ ఫోటోలో ఉన్న బాలుడు గాంధీజీకి స్వ‌యంగా మ‌న‌వ‌డు.. ఆయ‌న మూడో కుమారుడు రాందాస్ గాంధీ కొడుకు కానూ భాయి గాంధీ..
అమెరికాలో చ‌దువుకొని నాసాలో ప‌రిశోధ‌న‌లు చేసిన కానూభాయి గాంధీ దంప‌తుల‌కు సంతానం లేదు. విదేశాల్లో కాలం క‌లిసి రాక వృద్ధాప్యంలో స్వ‌దేశం వ‌చ్చారు.. కానీ ఇక్క‌డ వారిని ఆద‌రించేవారే క‌రువ‌య్యారు.. చేసేది లేక ఓ వృద్ధాశ్ర‌మంలొ కాలం వెల్ల‌దీస్తున్నారు కానూభాయి దంప‌తులు.. ఈ విష‌యం ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీకి తెలియ‌డంతో ఆయ‌న కేంద్ర‌మంత్రి మ‌హేష్ శ‌ర్మ‌ను కానూభాయి ద‌గ్గ‌ర‌కు పంపారు.. మోదీ ఫోనులో కానూభాయితో మాట్లాడ‌మే కాదు, ఆయ‌న‌కు అన్ని విధాలా సాయం చేస్తాన‌ని అభ‌య హ‌స్తం అందించారు..
చెట్టు పేరు చెప్పుకొని కాయ‌లు అమ్ముకున్న చందాన‌ మ‌హాత్మా గాంధీ పేరు చెప్పుకున్న న‌కిలీ గాంధీలు ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పాలించి అందినంత దండుకొని స్కాముల్లో ఇరుక్కున్నారు.. కానీ అస‌లైన గాంధీ వార‌సులు మాత్రం కీర్తి గుర్తింపున‌కు నోచుకోకుండా పోయారు.. 
హే రామ్‌.. దేశ ప్ర‌జ‌లు ఇకనైనా అస‌లుకు, న‌కిలీకి తేడా గ్ర‌హించాల‌ని కోరుకుందాం.. 

No comments:

Post a Comment