Friday, May 20, 2016

దేశ రాజకీయం మారుతోంది..

ఇది జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులకు సంకేతం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అసోంలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మిగతా రాష్ట్రాల్లో సీట్లు రాకున్నా ఓట్ల శాతం ఘననీయంగా పెరిగింది..
కాంగ్రెస్ తన ప్రభావాన్ని దాదాపు కోల్పోయింది.. అసోం, కేరళలను పోగొట్టుకుంది.. ఇప్పుడు ఆ పార్టీ కర్ణాటకలో తప్ప కొన్ని చిన్న రాష్ట్రాలకే పరిమితం అయింది..  కేరళలో వామపక్షాలతో పోరు, బెంగాల్లో దోస్తీ ఇది కాంగ్రెస్ దుస్థితి.. తమిళనాడులో డీఎంకేతో పొత్తు ఫలితం లేకుండా పోయింది..
ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో బీజేపీ మరింత బలమైన శక్తిగా అవతరిస్తోంది.. మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు రాజ్యసభలో అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్ ఆటలు ఇక చెల్లవు.. రాజ్యసభలో బీజేపీ బలం పెరుగుతోంది.. ఇది ఆర్థిక సంస్కరణలకు ఊతం ఇస్తుంది.. ఇప్పుడు కాంగ్రెస్ శత్రువులయిన ఏఐఏడీఎంకే, టీఎంసీలు కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనప్పుడు సహకరిస్తాయి.. మోదీ వ్యతిరేకతే ఎజెండాగా పని చేస్తున్న పార్టీలకు ఇది చెంపపెట్టు.. ఇవన్నీ దేశానికి దీర్ఘకాలంలో మేలు చేసే పరిణామాలు..

No comments:

Post a Comment