Wednesday, April 6, 2016

బాబా నిజమే చెప్పారు కదా..

అసలు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందో నాకేమీ అర్థం కాలేదు.. వివాదాస్పద వ్యాఖ్యలు అంటున్నారు.. అసలు వివాదం ఏముంది?.. భారత మాతకు జై అనబోమని కొంత మంది అంటున్నారు.. మన దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి ఊరుకున్నాం.. లేకుంటే లక్షల తలలు తెగేవి.. ఇవి రాందేవ్ బాబా మాటలు..
భారతమాతపై గౌరవాన్ని, దేశభక్తిని, ఈ దేశ చట్టాలు, రాజ్యాంగంపై ఉన్న నిష్టను బాబా చాలా స్పష్టంగా చాటుకున్నారు.. మరి తప్పు పట్టాల్సింది ఎక్కడ?

బాబా రాందేవ్ పై కేసులు పెట్టాలి, అరెస్టు చేయాలి అంటూ రంకెలు వేస్తున్నవారికి ఒక ప్రశ్న.. అయ్యా గతంలో ఒక నాయకుడు చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని చేసుకోండి.. పోలీసులు కొద్ది నిమిషాలు తప్పకుంటే చాలు.. హిందువులందరికీ నరికి పోగులేస్తాం..ఈ మాటలు ఎవరన్నారో గుర్తు చేసుకోండి..       అప్పుడు ఎక్కడ దాక్కున్నారు మీరంతా?.. 

No comments:

Post a Comment