Tuesday, April 5, 2016

సంచలనం సృష్టించిన ఐసీఐజే..

రూ. 15500000000000000 అంటే 1550 లక్షల కోట్ల రూపాయలు.. వామ్మో అసలు క్యాలిక్యులేటర్లో కూడా పట్టలేదు ఈ లెక్క.. మొత్తానికి పనామా పేపర్స్ ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.. అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి (ఐసీఐజే) 1 కోటి 15 లక్షల రహస్యపత్రాలను బయట పెట్టింది.. ప్రపంచ పరిశోధనాత్మక జర్నలిజంలో కనీవినీ ఎరుగని సంచలనం ఇది.. రహస్య మార్గాల్లో నల్లధనాన్ని పోగేసిన వారిలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. అమితాబ్, ఐశ్వర్య తదిరత 500 మంది భారతీయ ప్రముఖులు ఉండటం చూసి నోళ్లు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది..

ఈ కుంభకోణం ప్రపంచాన్ని కుదిపేసింది.. అనేక దేశాల్లో పీఠాలను కదిలిస్తోంది.. నల్ల దొరలు ఇంకా తాము పరిశుద్దులమని చెప్పుకుంటే ఆత్మ వంచన చేసుకోవడమే అవుతుంది.. చేసిన పాపం ఏనాటికైనా బయటకు రాక తప్పదు అని చెప్పక తప్పదు.. ఐసీఐజే సృష్టించిన ఈ పనామా పేపర్స్ దుమారంలో నిజా నిజాలు చట్టప్రకారం దర్యాప్తులోనే తేలాలి.. కానీ ఈ పరిశోధనాత్మక కథనాన్ని అభినందించాల్సిందే.. 

No comments:

Post a Comment