Sunday, December 30, 2012

ఇతర కీచకుల సంగతి ఏమిటి?

ఢిల్లీలో ఓ యువతి సామూహిక అత్యాచారం, ఆమె మరణానికి యావద్దేశం చలించిపోయాంది.. అమానత్ కు జరిగిన అన్యాయంపై యువత తిరగబడింది.. అత్యాచారం చేసిన వారికి ఉరి తీయాలంటూ ఆక్రోశించింది.. ఆమెకు జరిగిన అన్యాయం ఎవరూ పూడ్చలేనిది కాదనలేం.. అమానత్ పోతూ పోతూ మన ముందు ఎన్నో ప్రశ్నలను వదిలి వెళ్లింది..
దేశంలో గతంలో ఇంతకన్నా దారుణ అత్యాచార సంఘటనలు జరగలేదా? వివిధ రాష్ట్రాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఎన్నో భయంకరమైన సామూహిక అత్యాచార సంఘటనలు, హత్యలు జరిగాయి.. ఇలాంటి ఘటనలకు పాల్పడ్డవారిలో కేవలం నేరగాళ్లు మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటే.. పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు, ఉన్నతాధికారులు.. వారి సంతానంపై కూడా ఎన్నో కేసులు నమోదయ్యాయి.. పలుకుబడి ఉన్న వారు ఎలాంటి శిక్షలు పడకుండా తప్పించుకు తిరుగుతూనే ఉన్నారు..
అమానత్ అత్యాచార సంఘటన తర్వాత ఇంత పెద్ద ఆందోళన జరిగినా, రేపిస్టులు ఎలాంటి భయం లేకుండా తమ పని తాము కానించారు.. పలు చోట్ల అత్యాచార సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.. దేశ రాజధానిలో జరిగిన సంఘటన  కాబట్టి అమానత్ కు జరిగిన అన్యాయం అతి పెద్దదిగా కనిపించి ఉండవచ్చు.. కానీ అమానత్ విషయంలో స్పందించిన వారు మిగతా వారి విషయంలో ఎందుకు స్పందించడం లేదు? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది..

No comments:

Post a Comment