Saturday, March 31, 2018

సెక్యులర్ సైకోన్మాదం



తమిళనాడులో పట్టపగలు కొందరు సైకోలు శ్రీరామచంద్రుని చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ ఊరేగిస్తున్న ఈ దృశ్యాలు ఇవి.. మెజారిటీ హిందువులకు స్వాభిమానం, చీము నెత్తురు లేవు కాబట్టి ఇలాంటి ఘటనలు రాబోయే రోజుల్లో కూడా సర్వసాధారణం కావచ్చు.. ఇదే ఘటన ఇతర మతస్తుల విషయంలో జరిగి ఉంటే ఏమయ్యేది?.. 
సెక్యులర్ పెక్యులర్స్ అంతా గోల చేసేవారు కాదా?.. ద్రవిడవాదం, పెరియార్ పేరు చెప్పుకునే ఈ విచ్చిన్నకర శక్తుల వెనుక ఉన్నది ఎవరు.. పక్కనే ఉన్న పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
శ్రీలంకలో ఈలం పేరిట ప్రత్యేక దేశం కోసం పోరాడిన ఎల్టీటీఈకి మద్దతు ఇచ్చిన వారు ఈ రోజు మరోసారి ద్రవిడస్థాన్ పేరుతో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నారు. తమిళనాడును విడదీయాలి అనేది వారి దీర్ఘకాలిక కుట్ర. దీనికి ద్రావిడవాదం, పెరియారిజం అనేవి ముసుగులు.. రామున్ని అవమానిస్తున్న సైకో బ్యాచ్ అంతా ఈ విభజన మనస్థత్వం కలవారే.. కేవలం తమిళనాడు ఉంటే సరిపోదని దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కలిపి ద్రవిడస్థాన్ ఏర్పడాలంటున్నారు ఈ విద్రోహులు.. భారత దేశంలో భాగంగా ఉన్న తమిళనాడులో హిందువుల విశ్వాసాలకు ఇంతటి అవమానం జరుగుతుంటే, ఈ సైకోలు కోరుకునే ద్రవిడస్థాన్ వస్తే ఏమౌతుందో ఆలోచించారా?.. 
తెలిసో తెలియకో ద్రవిడస్థాన్ కావాలి, దక్షిణ భారత దేశం విడిపోవాలి అనే వాదించే మన తెలివి తక్కువ తెలుగు వితండ వాదులకు కూడా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను.. రామున్ని అవమానించిన వారు రేపు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తారు.. అప్పుడు ఈ సెక్కులర్ పాఠాలు వళ్లించే పెక్యులర్స్ ఎవరూ నిన్ను రక్షించేందుకు రారు అన్నది గుర్తుంచుకో..
22.03.2018

No comments:

Post a Comment