Monday, June 6, 2016

మ‌ర‌పురాని ఆత్మీయ స‌మావేశం..

దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత అంతా ఒక చోట క‌లిసిన సంద‌ర్భం.. మేమంతా ఈనాడు దిల్‌సుఖ్‌న‌గ‌ర్ జోన్ ప‌రిధిలో 90'sలో పాత్రికేయ వృత్తిలో ప్ర‌వేశించాం.. కొంద‌రం జ‌ర్న‌లిస్టులుగానే స్థిర‌ప‌డ్డాం.. మ‌రి కొంద‌రు వివిధ వృత్తుల‌ను ఎంచుకున్నారు.. అలా 25 ఏళ్లు పూర్త‌వుతున్నా మా మ‌ధ్య  స్నేహ సంబందాలు, ఆప్యాయ‌త‌లు కొన‌సాగుతూ ఉన్నాయి.. ఈ నేప‌థ్యంలో మేమంతా ఒక చోట క‌లుద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాం.. ఇలా రూపుదిద్దుకున్న‌దే ఈ ఆత్మీయ స‌మావేశం.. జూన్ 5వ తేదీన మ‌న్సురాబాద్‌లోని ఎస్‌వీఆర్ క‌న్వెన్ష‌న్ ఇందుకు వేదిక‌గా మారింది..
ఈ కార్య‌క్ర‌మంలో ఆనాటి మ‌ధుర స్మృతుల‌ను, క‌ష్ట సుఖాల‌ను పంచుకున్నాం.. మా సిటీ చీఫ్ న‌ర‌సింహారావు, స‌బ్ ఎడిట‌ర్లు గోవింద్ రెడ్డి, వెంక‌ట‌ర‌మ‌ణ శ‌ర్మ‌, జివీ, హ‌రింద‌ర్ గార్ల‌ను స‌త్క‌రించుకున్నాం.. ఇంత మంది పాత మిత్రుల‌ను క‌లుసుకోవ‌డం చాలా ఆనందాన్ని క‌లిగించింది.. ఇదొక మ‌ర‌పురాని రోజు
నాతో (క్రాంతి దేవ్ మిత్ర‌) పాటు శ్రీయుతులు భ‌వానీ శంక‌ర్‌, చిత్త‌లూరి వెంక‌టేశ్వ‌ర్లు, సామ‌ల ర‌వీంద‌ర్‌, సుంద‌ర్‌, కె.శ్రీనివాస్ రెడ్డి, మేక‌ల స‌త్య‌నారాయ‌ణ‌, భుజంగ రెడ్డి, హంస‌రాజ్‌, కోటేశ్వ‌ర‌రావు, ఫ‌ణిధ‌ర్‌, సంప‌త్ కుమార్‌, భ‌క్త‌వ‌త్స‌లం, ఏ వెంక‌టేశ్వ‌రావు, అర‌వింద్ శ‌ర్మ‌, సి.శ్రీనివాస్‌, జి. ర‌మేష్‌, కొండ‌ల్ రెడ్డి, కె. న‌ర‌సింహా ఈ ఆత్మీయ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.. అంద‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు..




No comments:

Post a Comment