Monday, June 13, 2016

పండిట్లకు మంచి రోజులు వచ్చేనా?

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబ్ మూఫ్తీ శ్రీనగర్ సమీపంలోని ఖీర్ భవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు.. కాశ్మీర్ పండిట్లు లోని కాశ్మీరం అసమగ్రం అని, వారిని తిరిగి లోయలోకి రప్పించి పునరావాసం కల్పించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తానని ఆమె అంటున్నారు.. కాశ్మీర్లో అన్ని రకాల సమస్యలు తొలగి తిరిగి సంతోషం వెల్లివిరియాలని మహబూబా ఆకాంక్షించారు..
దుర్గామాత అవతారమైన ఖీర్ భవానీ కాశ్మీరీ పండిట్ల ఆరాధ్య దేవత..  కాశ్మీర్లో ఉగ్రవాదం వెర్రితలలు వేసి, పండిట్లను లోయ నుండి తరిమేసినా, ప్రతిఏటా జరిగే  భవానీ అమ్మవారి వార్షిక వేడుకలకు వారు క్రమం తప్పకుండా హాజరు ఆనవాయితీగా వస్తోంది..
జమ్మూ కాశ్మీర్లో బీజేపీ-పీడీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అక్కడి పరిస్థితిలో మార్పు వస్తోంది.. కాశ్మీరంలో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టి, తిరిగి జాతీయ జనజీవన స్రవంతిలో చేరదాన్ని మనం త్వరలో చూడవచ్చు..

No comments:

Post a Comment