Thursday, October 24, 2013

పిరికివాడు అనుక్షణం చస్తాడు..

ధైర్యవంతుడు ఒకేసారి చస్తాడు.. పిరికివాడు అనుక్షణం చస్తాడు. రాహుల్ గాంధీ ఎంత బలహీన మనస్కుడో చూడండి.. ఆయన నానమ్మ, నాన్నల్లా తననూ చంపేస్తారట.. అదీ రాజకీయ ప్రత్యర్థి బీజేపీపై అనుమానం వ్యక్తం చేశాడు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను ఎవరు హత్య చేశారో రాహుల్ కి తెలియదా?
ఖలిస్తాన్, ఎల్టీల్టీఈలను ప్రోత్పహించింది ఎవరు? వీరిద్దరు నాయకులే కదా? బింద్రన్ వాలే, ప్రభాకరన్ లను తయారు చేసింది ఎవరు?.. పాముకు పాలుపోసి పెంచితే చివరికి ఏమైంది..
ఇందిర హత్య తర్వాత ఢిల్లీలో 3000 మంది సిక్కులను ఊచకోత కోసిందెవరు? ప్రభాకరన్ కు మద్దతు ఇచ్చినందుకే కదా 1991లో రాజీవ్ హత్య తర్వాత తమిళనాట డీఎంకు సర్కారును డిస్మిస్ చేశారు?.. అదే డీఎంకేను యూపీఏలోకి తీసుకొని అంటకాగుతున్న పార్టీ కాంగ్రెస్ కాదా? రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష పెట్టమన్న మహాతల్లి సోనియా కాదా?
వాస్తవ చరిత్ర ఇలా ఉంటే రాహుల్ గాంధీ ఎవరి మభ్య పెట్టడానికి కపట భయం ప్రదర్శిస్తూ, ఉద్వేగ ప్రసంగంతో దేశ ప్రజలను మభ్య పెడుతున్నారు.. రాహుల్ ఎంత ప్రయత్నించినా ఐసీయూలో ఉన్న యూపీఏ, కాంగ్రెస్ పార్టీలకు ప్రాణ ప్రతిష్ట చేయలేరు. 

No comments:

Post a Comment