Wednesday, October 23, 2013

సామాన్యుడు బతకొద్దా?..

పెట్రోలు ధర ఎన్నో రెట్లయింది.. కూరగాయల ధరలు భగ్గు మంటున్నాయి.. రైలు, బస్సు ప్రయాణాలూ భారమైపోయాయి.. చివరకు దిన పత్రికల ధరలూ ఆకాశంలోకి పోయాయి..
ధరలు అందనంత ఎత్తుకు పోతున్నా, జీతాలు మాత్రం పెరగవు.. పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎలా జీవించాలి?.. ప్రభుత్వం ఉద్యోగులకు అన్నిరకాల 'బెనిఫిట్లు' ఉంటాయి. సమ్మెలు చేసినా ఎప్పుడో ఒకప్పుడు వేతనాలు చేతికొస్తాయి.. పీఆర్సీలు ఉండనే ఉన్నాయి.. మరి మా బోటి ప్రయివేటు జీవులు బతకడం ఎలా?
ఈ స్పృహ పాలకులకు ఉందా? అనే అనుమానం కలుగుతోంది.. ప్రభుత్వం ధరలు పెంచినప్పుడల్లా ప్రతిపక్షాలు రోడ్లపైకి వచ్చి రస్తారోకోలు చేసి దిష్టి బొమ్మలు కాల్చి చేతులు దులుపుకొని పోతాయి.. కానీ సమస్య మాత్రం ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లు ఉంటోంది.. ఈ సమస్యకు పరిష్కారం లేదా? సామాన్యుడు చస్తునా పట్టించుకోరా?

No comments:

Post a Comment