Saturday, September 2, 2017

పరకాల అమరులకు నివాళులు

70 ఏళ్ల క్రితం ఇదే రోజు ప‌ర‌కాల‌లో ర‌క్తం చిందింది. మ‌రో జ‌లియ‌న్ వాలాబాగ్ ఘ‌ట‌న‌గా చ‌రిత్ర‌లో నిలిచిపోయింది..
సెప్టెంబ‌ర్ 2, 1947..
భార‌త దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చినా, హైద‌రాబాద్ స్టేట్ ఇంకా నిజాం నిరంకుశ పాల‌న‌తో మ‌గ్గిపోతోంది. వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర‌కాల‌లో జాతీయ ప‌తాకాన్ని ఎగుర వేసేందుకు చుట్టుప‌క్క‌ల గ్రామాల నుంచి జ‌నం పెద్ద సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చారు. ఆగ్ర‌హించిన నిజాం పోలీసులు, ర‌జాకార్లు విచ‌క్ష‌ణా ర‌హితంగా ఊరేగింపుపై కాల్పులు జ‌రిపారు. ఆనాటి ఘ‌ట‌న‌లో 15 మంది మ‌ర‌ణించారు, అంత‌కు ఎన్నో రెట్లు జ‌నం గాయ‌ప‌డ్డారు.. దుర‌దృష్టం కొద్దీ ఈ ఘ‌ట‌న‌కు చ‌రిత్ర‌లో పెద్ద‌గా స్థానం దొర‌క‌లేదు.. ప‌ర‌కాల అమ‌రులు ఘ‌నంగా నివాళ్ల‌ర్పిద్దాం.. 

No comments:

Post a Comment